Don't Miss!
- News వీళ్లా..వైఎస్ వారసులు, పక్కన పెట్టింది ఇందుకే - షర్మిల పై జగన్ ఫైర్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఎన్టీఆర్ కి 'ఎంఎల్.ఏ' పోస్ట్ ఖరారు
గత మూడేళ్లుగా ఎన్టీఆర్ ..'ఎంఎల్.ఏ'అవుతాడంటూ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్క్రిప్టుకి ఇన్నాళ్లకు మోక్షం వచ్చిందంటున్నారు. జూలై లో ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చిత్రం డైరక్ట్ చేస్తున్న హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. గతంలో ఎన్టీఆర్ తో ఆది వంటి సూపర్ హిట్ ఇచ్చిన నల్లమలుపు బుజ్జి 'షాక్' డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్లాన్ చేయబోతున్న చిత్రం ఇది. ఎం ఎల్ ఎ టైటిల్ అర్దం మంచి (ఎం)లక్షణాలు (ఎల్)ఎ(అబ్బాయి) అని వారి భావమట. టైటిల్ ఒకటే ఇలా రాజకీయాల్ని గుర్తు చేస్తుందా లేక సినిమా కూడా రాజకీయాలచుట్టూ తిర్గుతుందా అనేది ఇంకా తెలియరాలేదు.
అయితే మాత్రం సినిమాలో పొలిటికల్ సెటైర్స్ మాత్రం ఉంటాయిని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మరో విశేషముంది. పెద్ద ఎన్టీఆర్ ని గాడ్ ఫాదర్ గా చెప్పే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా చేయబోతున్నారని న్యూస్. ఇక దమ్ము చిత్రం తర్వాత ఎన్టీఆర్ చేయబోయేవి శ్రీను వైట్ల,హరీష్ శంకర్ చిత్రాలు మాత్రమే అని తెలుస్తోంది. బోయపాటి శ్రీను దర్సకత్వంలో రూపొందుతున్న దమ్ము చిత్రం మాస్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న సంగతి తెలిసిందే.