twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బొమ్మరిల్లు' నిర్మాతకు ఎదురుదెబ్బ

    By Staff
    |

    Bommarillu
    గుంటూరు: కాపీరైట్‌ చట్టాన్ని ఉల్లంఘించిన 'బొమ్మరిల్లు' చిత్ర నిర్మాత, దర్శకులు ఆ సినిమాపై ఇప్పటివరకు వచ్చిన లాభాలను మూడు నెలల్లోపు లెక్కించి, రచయిత డీబీఎస్‌బీ రామ్మూర్తికి వాటా ఇవ్వాలని గుంటూరు నాలుగో అదనపుజిల్లా కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. గుంటూరుకు చెందిన రామ్మూర్తి తాను రచించిన తొమ్మిది కథల కథామాలికను 'ఆ.మె.లో ఏముంది' పేరిట 1997లో ప్రచురించారు. ఆ తర్వాత 2006లో దిల్‌ రాజు, భాస్కర్‌ దర్శకత్వంలో 'బొమ్మరిల్లు' చిత్రం రూపొందించారు.

    ఈ చిత్రకథ తన కథామాలికలోని 'ప్రేమ'కు కాపీ అని, తన అనుమతి లేకుండా ఇలా చేశారని రామ్మూర్తి, వారికి లీగల్‌ నోటీసు ఇచ్చారు. వారినుంచి జవాబు రాకపోవడంతో 2007 ఏప్రిల్‌లో కోర్టులో దావావేశారు. దీంతో చిత్ర ప్రదర్శన ఆపివేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వు జారీచేయగా, నిర్మాత హైకోర్టు నుంచి స్టే పొందారు. అయితే నిర్మాత, దర్శకుడు ఆ తర్వాత కోర్టుకు హాజరుకాకపోవడంతో వారి పరోక్షంలో 'బొమ్మరిల్లు' ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు డిక్రీ జారీచేసింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X