Don't Miss!
- News barrelakka: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క
- Sports IPL 2024: అందుకే పృథ్వీ షా ఆడటం లేదు: సౌరవ్ గంగూలీ
- Lifestyle గుడ్ ఫ్రైడే 2024 ఎప్పుడు? క్రైస్తవులు గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు?మీకు తెలియని కొన్ని వాస్తవాలు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
నాగార్జున 'గగనం' దర్శకుడి మరో చిత్రం 'మాటరాని మౌనమిది'
దిల్ రాజు నిర్మాణంలో నాగార్జన హీరోగా రూపొందిన "గగనం" చిత్రం దర్శకుడు రాధామోహన్. ఆయన 2007వ సంవత్సంలో తమిళంలో 'మొళి' అనే చిత్రం రూపొందించారు. జ్యోతిక ప్రధాన పాత్రలో నటించిన తమిళ చిత్రం అక్కడ అవార్డులను, రివార్డులను సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని తెలుగులో 'మాటరాని మౌనమిది' పేరుతో అనువదించారు. ప్రకాష్ రాజ్, పృధ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. రాధామోహన్ దర్శకుడు. ఎన్. అచ్యుత కాంతారావు నిర్మాత. ఇటీవలే ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేశారు. తొలి సీడీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ "తమిళంలో మాదిరే తెలుగులోనూ ఈ చిత్రం విజయవంతమవుతుంది. జ్యోతిక నటనకి తమిళనాడు ప్రభుత్వ అవార్డు దక్కడం సంతోషంగా ఉంది. విద్యాసాగర్ చక్కటి బాణీలను అందించార"న్నారు "అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా రాధామోహన్ సినిమాను రూపొందించారు. ఆహ్లాదకరంగా సాగుతుంది. ఈ నెల్లోనే విడుదల చేస్తామ"న్నారు నిర్మాత. ఆదిత్య ద్వారా పాటలు విడుదలయ్యాయి.