Don't Miss!
- Sports RR vs DC: అందుకే పృథ్వీ షాను తీసుకోలేదు: రిషభ్ పంత్
- News హీరోయిన్ నిధి అగర్వాల్ చేతుల మీదగా గ్రాండ్గా రీలాంచ్ అయిన CMR షాపింగ్ మాల్
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
టాలీవుడ్ నిర్మాతకు బెదిరింపులు: వచ్చి సెటిల్ చేస్కో లేదంటే చంపేస్తాం అంటూ
డబ్బులకోసం టాలీవుడ్ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్ ని బెదిరించారు గుర్తు తెలియని వ్యక్తులు, అదీ "సెటిల్" చేసుకొమ్మనీ లేదంటే చంపేస్తామని
డబ్బులకోసం టాలీవుడ్ నిర్మాతని బెదిరించారు గుర్తు తెలియని వ్యక్తులు, అదీ "సెటిల్" చేసుకొమ్మనీ లేదంటే చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు తనను బెదిరిస్తున్నారని టాలీవుడ్ నిర్మాత కే ఎల్ ప్రసాద్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
జర్నలిస్టు కాలనీలో నివాసముండే సినీ నిర్మాత కేఎల్ దామోదర్ ప్రసాద్కు శనివారం మధ్యాహ్నం ఓ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. ఆయన పనిలో ఉండి లేపలేదు. గంట తర్వాత మరో రెండు సార్లు ఫోన్ వచ్చింది. దీంతో దామోదర్ ఫోన్ లిఫ్ట్ చేయగా అవతలి వైపు నుంచి గుర్తు తెలియని వ్యక్తి ఇష్టం వచ్చినట్టు తిడుతూ మాట్లాడాడు.
ఎవరు మీరు.. అని దామోదర్ ప్రసాద్ అడిగినా వినిపించుకోకుండా అవతలి వ్యక్తి గట్టిగా కేకలు పెడుతూ తిట్టాడు. తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్ తనకు డబ్బులు ఇవ్వాలని, అతను నీకు కూడా మితృడే కాబట్టి మ్యాటర్ను వెంటనే వచ్చి సెటిల్ చేసుకోవాలని లేదంటే చంపేస్తామని బెదిరించి ఫోన్ పెట్టేశాడు.
దీంతో దామోదర్ ప్రసాద్ తనకు గుర్తు తెలియని వ్యక్తి వల్ల ప్రాణభయం ఉందని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ప్రతాని రామకృష్ణగౌడ్ తనకు ఫిలించాంబర్ అధ్యక్షుడిగా మాత్రమే తెలుసునని ఆయనతో ఎలాంటి వ్యాపారం చేయలేదని తెలిపారు. ఫోన్లో దూషణలకు దిగిన వారిని పట్టుకొని శిక్షించాలని కోరారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దామోదర్ప్రసాద్కు వచ్చి ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.