Don't Miss!
- News అప్పుడు వైసీపీ..ఇప్పుడు టీడీపీ.. యంగ్ హీరో ఇలా మారిపోయాడేంటి..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్ప్లస్ 13 స్మార్ట్ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
50 మంది చిన్నారులతో కె.రాఘవేంద్రరావు
నవంబరు 1 నుంచి 20 వరకు అరుకులోయలో తొలి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. అకాడమీకి చెందిన 25 మంది చిన్నారి నృత్య కళాకారిణులు, మరో 20 మంది బాలగాయకులు పాల్గొంటారు. ఇందుకోసం 6 నుంచి 11 ఏళ్లలోపుచిన్నారులను ఎంపిక చేశారు. నాలుగురోజులపాటు షూటింగ్ జరుగుతుంది. చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబా, కథానాయకుడు రేవంత్, అసిస్టెంట్ డైరెక్టర్ స్వర్ణగౌరి, అకాడమీ వ్యవస్థాపకుడు సంగాపు వెంకటరావు, డైరెక్టర్ తిలగవతి తదితరులు పాల్గొన్నారు.
'శ్రీరామరాజ్యం' చిత్రంతో తన బేనరు ప్రతిష్టను పెంచుకున్న సాయిబాబా మూవీస్ అధినేత యలమంచిలి సాయిబాబా నిర్మిస్తున్న తాజా చిత్రం 'ఇంటింటా అన్నమయ్య'. సీనియర్ డైరెక్టర్ కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపుదిద్దుకునే ఈ చిత్రంలో సాయిబాబా తనయుడు రేవంత్ హీరోగా పరిచయమవుతున్నారు. అనన్య, సనంశెట్టి కథానాయికలు. ఈ చిత్రం షూటింగ్ విజయదశమి సందర్భంగా బుధవారం హైదరాబాద్లో ప్రారంభమైంది.
నిర్మాత యలమంచిలి సాయిబాబా మాట్లాడుతూ 'భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని తెలిపే అద్భుతమైన కథ ఇది. ఓ కొత్త పంథాలో రూపొందే ఈ సినిమాలో యువతరం మెచ్చే ప్రేమకథ కూడా ఉంటుంది. అన్నమయ్య కీర్తనల నేపథ్యంలో సంగీత ప్రధానంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కొన్ని కీర్తనలు హిందూస్థానీ కలయికలో ఉంటాయి.
ఐదు పాటల రికార్డింగ్ పూర్తయింది. కీరవాణి సంగీతం ఈ సినిమాకి ప్రధాన ఆకర్షణ. నవంబర్ ఒకటి నుంచి ఇరవై వరకూ అరకు లోయలో తొలి షెడ్యూల్ జరుగుతుంది. రెండో షెడ్యూల్ డిసెంబర్ ఒకటి నుంచి హైదరాబాద్లో ఉంటుంది' అని తెలిపారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, జయప్రకాశ్రెడ్డి, సుధ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: ఎస్.గోపాలరెడ్డి, సంగీతం: కీరవాణి, నిర్మాత: యలమంచిలి సాయిబాబా, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కె.రాఘవేంద్రరావు.