twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ హీరోతో..రాఘవేంద్రరావు?

    By Staff
    |

    K Raghavendra Rao
    దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తన తదుపరి చిత్రం మంచు మనోజ్ కుమార్ తో చేయనున్నట్లు సమచారం. పాండురంగడు అనంతరం పరుశరాముడు చేద్దామనుకున్నా..ప్రభాస్ డేట్స్ లేటవటం, శ్రీరాముడు పాత్ర వేయిద్దామనుకుంటున్న ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే సెట్స్ మీదకు వచ్చే పరిస్ధితి లేకపోవటం గమనించిన ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందులోనూ వరస పౌరాణికాలు కన్నా ఆయన ట్రేడ్ మార్క్ అయిన పూర్తి స్ధాయి పక్కా మసాలా చిత్రం చేయాలని రాఘవేంద్రరావుకి సన్నిహితులు చెప్తున్నట్లు తెలుస్తోంది.

    ఇక మనోజ్ ఎంతో ఆసక్తితో చేసిన నేను మీకు తెలుసా చిత్రం ఫ్లాప్ కావటం, ప్రయాణం లేట్ కావటంతో కాస్త వెనకపడ్డానని, రాఘవేంద్రరావు దర్శకత్వంలో తిరిగి మెయిన్ స్ట్రీమ్ లోకి రావచ్చునని భావిస్తున్నాడు. తన తండ్రి మోహన్ బాబు ని అల్లుడు గారు చిత్రంతో హీరోగా నిలబెట్టినట్లే తనకూ ఆ దశ కల్పిస్తారని ఆశిస్తున్నాడు. ఇక ఈ చిత్రం లక్ష్మీ ప్రసన్న ఆర్ట్స్ బ్యానర్ పై మోహన్ బాబు నిర్మించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్టు వర్క్ జరుగుతోంది. అలాగే వర్షం, నువ్వొస్తానంటే నేవద్దంటానా చిత్రాలుకు కథ అందించిన వీరు పోట్ల దర్శకత్వంలోనూ మరో చిత్రం ఉంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X