Don't Miss!
- News బీఆర్ఎస్కు భారీ షాక్: ఎంపీ కే కేశవరావు, మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లోకి
- Sports RR vs DC: రియాన్ పరాగ్ విధ్వంసం.. 6 బంతుల్లో 5 బౌండరీలు!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
రాజమౌళికి ఆ విషయం చెప్పి చెప్పి విసుగొచ్చింది.. సుకుమార్ కూడా అంతే: కె.విజయేంద్రప్రసాద్ హాట్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీలో స్టార్ దర్శకుల మధ్య ఇటీవల కాలంలో స్నేహ సంబంధాలు చాలా ఎక్కువవుతున్నాయనే చెప్పాలి. ఒకప్పుడు అగ్ర దర్శకుల మధ్య విభేదాలు ఎక్కువగా ఎక్కువగా ఉండేవని నిత్యం చాలా రూమర్స్ వచ్చేవి. కానీ మారుతున్న కాలంతో పాటు అన్ని వర్గాల అగ్ర దర్శకులు కూడా వారి ఆలోచన విధానాన్ని అలాగే మేకింగ్ లో కూడా చాలా మార్పులు చేస్తున్నారు. ఒక దర్శకుడు హిట్ సినిమా తీస్తే వెంటనే అతడిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు.
ఇక స్టార్ దర్శకుల్లో మంచి మిత్రులు అయినటువంటి సుకుమార్ రాజమౌళి అంటే ఇండస్ట్రీలో అందరికీ గౌరవమే. వీరు మంచి స్నేహితులు అని సినిమా ప్రపంచంలో ఎవరిని అడిగినా చెబుతారు. అయితే ఇటీవల రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వారిపై ఎవరూ ఊహించని విధంగా ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
సుకుమార్ రాజమౌళి స్నేహం
సుకుమార్ రాజమౌళి మధ్య స్నేహం గత 15 ఏళ్ల నుంచి కొనసాగుతోంది. వారి స్నేహబంధం కూడా చాలా విచిత్రంగా బలపడింది. సుకుమార్ జగడం సినిమా సమయంలో ప్లాప్ రావడంతో చాలా డిప్రెషన్ కు గురయ్యాడు ఆ సినిమా ఫ్లాప్ అవగానే కొన్ని రోజులు ఎవరితోనూ మాట్లాడలేదు. దీంతో మ్యాటర్ తెలుసుకున్న రాజమౌళి వెంటనే అతని దగ్గరికి వెళ్లి కారులో అలా బయటకు తీసుకు వెళ్ళాడట. పది నిమిషాలు రాజమౌళితో మాట్లాడగానే సుకుమార్ కు ఎక్కడలేని ధైర్యం వచ్చేసిందట.
సుకుమార్ సినిమా ప్లాప్ అయితే..
నువ్వు తప్పకుండా మంచి సినిమా చేయగలవు అని సినిమా చేసే ముందు బాగా ఆలోచించు.. మళ్లీ ఫామ్ లోకి వస్తావు అని సపోర్ట్ చేశాడట. ఈ విషయాన్ని దర్శకుడు నసుకుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమా సమయంలో కూడా రాజమౌళి సుకుమార్ అండగా నిలిచారు. సినిమా ప్రమోషన్ లో కూడా తన వంతు సహాయం చేశాడు. దాదాపు ఇద్దరి ఆలోచనలు ఒకే విధంగా ఉండటంతో తక్కువ పరిచయంలోనే క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు.
ఇద్దరి ఆలోచనలు ఒకేలా
కేవలం సినిమా గురించి మాత్రమే కాకుండా కుటుంబంలో ఎలాంటి వేడుకలు జరిగిన కూడా ఒకరినొకరు పిలుచుకోవడం అలవాటుగా మారిపోయింది. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కె.విజయేంద్రప్రసాద్ వీరి గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. దాదాపు ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. సినిమా మేకింగ్ విషయంలో ఎంతో నిబద్ధతతో ఉంటారు. ఒకటికి వంద సార్లు ఆలోచించి గానీ నిర్ణయం తీసుకోరు. చాలా కమిట్మెంట్తో ఉంటారు.
వారి బలహీనత అదే..
కానీ ఇద్దరిలో ఉన్న ఒక బలహీనత ఏమిటంటే సినిమాను తెరకెక్కించడంలో చాలా ఆలస్యం చేస్తుంటారు. నేను రాజమౌళికి చాలాసార్లు ఈ విషయాన్ని చెప్పాను. కొంచెం తొందరగా తీయమని వంద వంద సార్లు పైగా చెప్పి ఉంటాను కానీ ఎన్నిసార్లు చెప్పినా కూడా రాజమౌళి స్లోగానే సినిమాలు తీస్తున్నాడు. ఇక చివరికి ఆ విషయం చెప్పి చెప్పి ఇసుక పుట్టేసింది. ఆ విధంగా సుకుమార్ రాజమౌళి ఇద్దరూ ఒకే తరహా దర్శకులు అంటూ కే విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు.
RRR సినిమా గురించి..
ఇక ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. చిత్ర యూనిట్ కంటే ఎక్కువగా రచయిత విజయేంద్రప్రసాద్ ఆ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రతీ పాత్ర కూడా ప్రేక్షకుల హృదయాలను ఏదో ఒక విధంగా హత్తుకునేలా ఉంటుందని ముఖ్యంగా రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ మధ్య జరిగే ఫైట్ సన్నివేశం ప్రేక్షకులతో కంటతడి పెట్టిస్తుంది అని చెప్పారు. ఇద్దరు అన్నదమ్ములు కొట్టుకుంటే ఒక తల్లి ఎంత బాధ పడుతుందో ఆ విధంగా ప్రేక్షకులు కూడా బాధ పడతారని తెలిపారు.
మొదటి సారి అలాంటి సినిమా
ఇక మరోవైపు సుకుమార్ సినిమా విషయానికి వస్తే.. నెవర్ బిఫోర్ అనేలా అల్లు అర్జున్ తో మొదటి సారి పుష్ప అనే పాన్ ఇండియా సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. దాదాపు ఆ సినిమా 250 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ అయింది. దానికి తోడు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కూడా మొదటి పాటతోనే భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. RRR తరహాలోనే మొదట పాటను ఐదు భాషల్లో ఐదుగురు ప్రత్యేకమైన సింగర్స్ తో పాడిస్తున్నారు. ఆ సాంగ్ నెక్స్ట్ వీక్ లో విడుదల కానుంది.
అందుకే అప్పుడు రిలీజ్ చేయాలని
ఇక సినిమా రిలీజ్ విషయానికి వస్తే మొదట ఆగస్టు లోనే విడుదల చేయాలని అనుకున్నారు కానీ కరోనా ఇబ్బందితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా టికెట్స్ రేట్ల విషయంలో కొత్త నిర్ణయం తీసుకోకపోవడం నిర్మాతలకు కాస్త ఆందోళనకు గురిచేసింది. అందుకే ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు.
ఇక అప్పుడే కన్నడ పాన్ ఇండియా మూవీ KGF 2 కూడా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడకపోవచ్చు అని తెలుస్తోంది. ఇక పుష్ప రెండో భాగాన్ని వచ్చే ఏడాది సమ్మర్ అనంతరం విడుదల చేయాలని అనుకుంటున్నారు. మొదటి భాగానికి రెండవ భాగానికి ఆరు నెలల గ్యాప్ ఉండేలా చూసుకోవాలని మైత్రి మూవీ మేకర్స్ ఒక ఫార్ములాను ఫాలో అవుతున్నట్లు సమాచారం.