Don't Miss!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- News పొలిటికల్ స్టార్.. తెలంగాణా కాంగ్రెస్ కమాండర్ రేవంత్ రెడ్డి ఈజ్ బ్యాక్!!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
కె విశ్వనాధ్ లేటెస్ట్ చిత్రం రిలీజ్ ఎప్పుడంటే...
నరేష్, మంజరి జంటగా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో శ్రీ రాజరాజేశ్వరి ఫిలిమ్స్ ప్రై.లి. సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఈ నెలాఖరులో ఆడియోను, వచ్చే నెలాఖరులో సినిమాను విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయం నిర్మాత మీడియాకు తెలియపరిచారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన హరిగోపాలకృష్ణమూర్తి మాట్లాడుతూ...వయసును లెక్క చేయకుండా నేటి యువ దర్శకులతో సమానంగా శ్రమ పడుతూ అనుకున్న షెడ్యూల్స్ ప్రకారం అన్నవరం, కేరళ, విజయనగరం పరిసర ప్రాంతాల్లో చిత్రాన్ని విశ్వనాథ్ గారు చిత్రాన్ని పూర్తి చేయగలిగారు. ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అన్నారు. అలాగే విశ్వనాథ్ గారి గత చిత్రాలైన 'ఓ సీత కథ', 'శుభోదయం', 'శుభలేఖ' చిత్రాల కోవలో సునిశిత హాస్యంతో ఉండే సినిమా ఇది అన్నారు.
సుమధురం అనే వర్కింగ్ టైటిల్ తో తయారవుతున్న చిత్రం మన సంస్కృతి సంప్రదాయాలు, అనుబంధాలకీ, ఆప్యాయతలకీ అద్దంపట్టేలా తయారవుతోందని తెలుస్తోంది. ఈ చిత్రం కథ...మన చేతికి అందిన ప్రతి పైసాలోనూ మన కష్టం కనిపించాలి. అప్పుడే దాన్ని ఖర్చుపెట్టినా, వెనకేసుకున్నా తృప్తి మిగులుతుంది. అయాచితంగా వచ్చింది కదాని సొమ్ము పోగేస్తే నిలుస్తుందా?..ఈ విషయాన్ని చుట్టూ తిరుగుతుంది. అలాగే ఇందులో యాసిడ్ ఎటాక్స్ పై కొంత కథ నడవనున్నట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రస్తుతం డబ్బింగ్ జరుగుతోంది. ఈ చిత్రానికి మాటలు: ఎం.వి.ఎస్. హరనాథరావు, సంగీతం: మణిశర్మ. కె.విశ్వనాధ్...తన స్వరాభిషేకం చిత్రం అనంతరం రూపొందిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.