Don't Miss!
- Sports CSK vs LSG: వారెవ్వా రాహుల్.. వాటే క్యాచ్!వీడియో
- News జనసేనకు మద్దతుగా మెగాస్టార్...పిఠాపురంలో రెండు రోజులు పర్యటన
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
K Viswanath పాట రాస్తూ కే విశ్వనాథ్ మృత్యువు ఒడిలోకి! కొనఊపిరి వరకు సినిమా కోసం కళాతపస్వి తపన
భారతీయ వెండితెరపై శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల లాంటి అణిముత్యాలను అందించిన కే విశ్వనాథ్ ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2వ తేదీన కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన లేని లోటును ఎవరు పూడ్చలేరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన చివరి శ్వాస వరకు కూడా సినిమా కోసమే తపిస్తూ బతికారనేది గమనార్హం.
ఫిబ్రవరి 2వ తేదీ తనకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చిన శంకరాభరణం రిలీజ్ కావడంతో ఆయన రోజంతా ఉత్సాహంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణించే చివరి క్షణం వరకు పాటను రాస్తూ ఉన్నారు. ఆయన రాయలేని పరిస్థితుల్లో తన పెద్ద కుమారుడికి తన నోటి మాటలతో చెబుతూ పాటను రాయించారు. తన కుమారుడు రాసిన పాటను వింటూ అలాగే వాలిపోయారు. తాను రాసిన.. తన కుమారుడితో రాయించిన పాట వింటూ తుదిశ్వాస విడిచారు అని అన్నారు.
రోజంతా కష్టపడి స్వయంగా ఓ పాటను రాసే ప్రయత్నం చేశారు. అయితే తనకు సాధ్యపడకపోవడంతో కుమారుడిని పిలిచి తను చెబుతూ రాయించారు. అలా రాసిన పాటను వింటూనే వాలిపోవడంతో.. కంగారుపడిన కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు అని వైద్యులు ధృవీకరించారు. దాంతో ఆయన పార్ధీవదేహాన్ని తన నివాసానికి తీసుకొచ్చారు.