Don't Miss!
- News Rahul Gandhi: ఇది నా గ్యారంటీ-సీబీఐ, ఈడీలకు రాహుల్ వార్నింగ్-బీజేపీ సర్కార్ మారగానే..!
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్పై వేటు.. గుజరాత్తో తలపడే సన్రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
K Viswanath పాట రాస్తూ కే విశ్వనాథ్ మృత్యువు ఒడిలోకి! కొనఊపిరి వరకు సినిమా కోసం కళాతపస్వి తపన
భారతీయ వెండితెరపై శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల లాంటి అణిముత్యాలను అందించిన కే విశ్వనాథ్ ఇకలేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 2వ తేదీన కన్నుమూశారు. ఆయన మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన లేని లోటును ఎవరు పూడ్చలేరని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఆయన చివరి శ్వాస వరకు కూడా సినిమా కోసమే తపిస్తూ బతికారనేది గమనార్హం.
ఫిబ్రవరి 2వ తేదీ తనకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చిన శంకరాభరణం రిలీజ్ కావడంతో ఆయన రోజంతా ఉత్సాహంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మరణించే చివరి క్షణం వరకు పాటను రాస్తూ ఉన్నారు. ఆయన రాయలేని పరిస్థితుల్లో తన పెద్ద కుమారుడికి తన నోటి మాటలతో చెబుతూ పాటను రాయించారు. తన కుమారుడు రాసిన పాటను వింటూ అలాగే వాలిపోయారు. తాను రాసిన.. తన కుమారుడితో రాయించిన పాట వింటూ తుదిశ్వాస విడిచారు అని అన్నారు.
రోజంతా కష్టపడి స్వయంగా ఓ పాటను రాసే ప్రయత్నం చేశారు. అయితే తనకు సాధ్యపడకపోవడంతో కుమారుడిని పిలిచి తను చెబుతూ రాయించారు. అలా రాసిన పాటను వింటూనే వాలిపోవడంతో.. కంగారుపడిన కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు. అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు అని వైద్యులు ధృవీకరించారు. దాంతో ఆయన పార్ధీవదేహాన్ని తన నివాసానికి తీసుకొచ్చారు.