Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
అన్నీ బూతులే: కాళిచరణ్ ట్రైలర్పై నిషేదం
ప్రముఖ నిర్మాత దిల్రాజు చేతుల మీదుగా సోమవారం హైదరాబాద్లో ట్రైలర్స్ ఆవిష్కరణ కార్యక్షికమం జరిగింది. అయితే తాజాగా ఈ ట్రైలర్ ను సైబర్ క్రైం పోలీసులు బ్యాన్ చేసారు. ఈ ట్రైలర్లో బూతులు ఎక్కువగా ఉండటంతో పాటు.... రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగేలా ప్రోత్సహించేలా ఇది ఉండటంతో, ఆ ట్రైలర్ను వెంటనే అంతర్జాలంలో నుంచి వెంటనే తీసివేయాలని ఆదేశించారు. సినిమా నిర్మాత శ్రీప్రవీణ్ కూడా సినిమా ట్రైలర్ ను బ్యాన్ చేసిన విషయాన్ని ధృవీకరించారు. త్వరలోనే మరో ట్రైలర్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
దర్శకనిర్మాత శ్రీప్రవీణ్ ఇటీవల సినిమా గురించి....గతంలో ఓ ప్రెస్ మీట్లో వెల్లడిస్తూ 'ఎనభైదశకంలో మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన యదార్థసంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్ర కథను తయారుచేసుకున్నాను. రాజకీయ నేపథ్యంలో పగ, ప్రతీకారం ప్రధానాంశాలుగా కథ నడుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియోను విడుదల చేసి మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. సినిమా కోసం పదినెలల పాటు గడ్డం, మీసాలు పెంచానని చైతన్యకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వదేవబత్తుల, సతీష్ ముత్యాల, సంగీతం: నందన్రాజ్, లైన్ ప్రొడ్యూసర్: జూపల్లి శ్రీనివాస్.