Don't Miss!
- News ముస్లింలోను ఓబీసీ జాబితాలో చేర్చిన ప్రభుత్వం
- Sports T20 World Cup: ఆ కుర్రాడికి టికెట్ కన్ఫార్మ్- సెహ్వాగ్
- Finance Railway News: రైలు ప్రయాణికులకు శుభవార్త..! టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలు తగ్గింపు..
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
- Travel ఏపీలోని రైలు ప్రయాణికులకు శుభవార్త..వేసవి ప్రత్యేక రైళ్లు ఆగే స్టేషన్లివే..!
- Technology మే 7 న Apple 'Let Loose' ఈవెంట్! ఏ యే గాడ్జెట్లు లాంచ్ కాబోతున్నాయి? వివరాలు
- Automobiles 'కావ్య మారన్' ఖరీదైన కార్లు ఇవే! ఇక్కడ చూడండి
అన్నీ బూతులే: కాళిచరణ్ ట్రైలర్పై నిషేదం
ప్రముఖ నిర్మాత దిల్రాజు చేతుల మీదుగా సోమవారం హైదరాబాద్లో ట్రైలర్స్ ఆవిష్కరణ కార్యక్షికమం జరిగింది. అయితే తాజాగా ఈ ట్రైలర్ ను సైబర్ క్రైం పోలీసులు బ్యాన్ చేసారు. ఈ ట్రైలర్లో బూతులు ఎక్కువగా ఉండటంతో పాటు.... రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగేలా ప్రోత్సహించేలా ఇది ఉండటంతో, ఆ ట్రైలర్ను వెంటనే అంతర్జాలంలో నుంచి వెంటనే తీసివేయాలని ఆదేశించారు. సినిమా నిర్మాత శ్రీప్రవీణ్ కూడా సినిమా ట్రైలర్ ను బ్యాన్ చేసిన విషయాన్ని ధృవీకరించారు. త్వరలోనే మరో ట్రైలర్ రిలీజ్ చేస్తామని వెల్లడించారు.
దర్శకనిర్మాత శ్రీప్రవీణ్ ఇటీవల సినిమా గురించి....గతంలో ఓ ప్రెస్ మీట్లో వెల్లడిస్తూ 'ఎనభైదశకంలో మహబూబ్నగర్ జిల్లాలో జరిగిన యదార్థసంఘటనలను స్ఫూర్తిగా తీసుకొని ఈ చిత్ర కథను తయారుచేసుకున్నాను. రాజకీయ నేపథ్యంలో పగ, ప్రతీకారం ప్రధానాంశాలుగా కథ నడుస్తుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్షికమాలు జరుగుతున్నాయి. త్వరలో ఆడియోను విడుదల చేసి మే నెలలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు. సినిమా కోసం పదినెలల పాటు గడ్డం, మీసాలు పెంచానని చైతన్యకృష్ణ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: విశ్వదేవబత్తుల, సతీష్ ముత్యాల, సంగీతం: నందన్రాజ్, లైన్ ప్రొడ్యూసర్: జూపల్లి శ్రీనివాస్.