Don't Miss!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆచార్య సెట్లో అడుగుపెట్టిన కాజల్.. అదిరిపోయే ఫోటోను షేర్ చేయడంతో హైప్!
ప్రస్తుతం కాజల్ అగర్వాల్ టాలీవుడ్లో వార్తల్లో నిలుస్తోంది. మోసగాళ్లు సినిమాతో కాజల్ చాలా రోజుల తరువాత తెలుగు ప్రేక్షకులను పలకరించింది. పైగా పెళ్లి తరువాత తెలుగులో వస్తోన్న మొదటి చిత్రం కూడా ఇదే. కాజల్ స్క్రీన్పై కనిపించడంతో వచ్చిన క్రేజ్ ఎలా ఉందో సోషల్ మీడియాను చూస్తే తెలుస్తోంది. కాజల్ ఇంట్రడక్షన్ సీన్కు పేపర్ కటింగ్స్ ఓ రేంజ్లో వేయడం, అభిమానుల ఈలలు, గోలలు అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. కాజల్ ఇప్పుడు మరో సినిమాతో తెలుగు ఆడియెన్స్ను కట్టిపడేసేందుకు వస్తోంది.
ఆచార్యలో కాజల్..
మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కొరటాల శివ కాంబోలో రాబోతోన్న సినిమా ఆచార్య. ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. ఇప్పటికే చిత్రయూనిట్ వదిలిన పోస్టర్లు, టీజర్ అన్నీ కూడా సోషల్ మీడియాలో సునామినీ క్రియేట్ చేశాయి. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ చిరుకు జోడిగా నటిస్తోందన్న సంగతి తెలిసిందే.
ఆ మధ్య అలా..
కాజల్ అగర్వాల్ తన పెళ్లి అయిన తరువాత పాల్గొన్న మొదటి షూటింగ్, అడుగుపెట్టిన సెట్ ఆచార్య. అలా వివాహా అనంతరం మొదటిసారిగా భర్తతో కలిసి రావడంతో ఆచార్య యూనిట్ ఆమెకు మంచి స్వాగతం పలికింది. బొకే, శాలువాలతో సత్కరించి.. కేక్ కటింగ్ వంటి సెలెబ్రేషన్స్ చేశారు.
ఫుల్ స్వింగ్లో..
లాక్డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అందుకు ఇప్పుడు ఆచార్యను వీలైనంత త్వరగా నిర్విరామంగా షూటింగ్ చేస్తూ పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు. మే 13న ఈ మూవీ రాబోతోందంటూ కూడా డేట్ను ఫిక్స్ చేసేశారు.
అటవీ ప్రాంతంలో..
మొన్నటి వరకు మారెడు మిల్లి అటవీ ప్రాంతంలో షూటింగ్ చేశారు. అందులో రామ్ చరణ్, పూజా హెగ్డే, చిరంజీవిల మీద సీన్స్ తెరకెక్కించారు. అటుపై బొగ్గు గనుల్లో రామ్ చరణ్, చిరుపై కొన్ని యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఇక ఇప్పుడు చిరు, కాజల్ మధ్య రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించబోతోన్నట్టు కనిపిస్తోంది.
గెస్ చేయండి..
నాకెంతో ఇష్టమైన వ్యక్తితో షూటింగ్ చేస్తున్నాను.. అది ఎవరో కనిపెట్టండి అంటూ కాజల్ ఓ ఫోటోను షేర్ చేసింది. అది చిరంజీవి స్టిల్అని ఇట్టే తెలిసిపోతోంది. చేతికి ఆ ఎర్ర కండువా.. చేతికి ఆ గొలుసు అన్నీ కూడా ఆచార్య స్టిల్ అని తెలిసిపోతోంది. మొత్తానికి కాజల్ మళ్లీ ఇన్ని రోజుల తరువాత ఆచార్య సెట్లోకి అడుగుపెట్టేసింది.