Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
శర్వానంద్ కు షాక్.. కాజల్, నిత్యామీనన్ ఎందుకిలా చేశారు..!
Recommended Video
శర్వానంద్ ఇటీవలే స్వామిరారా ఫేమ్ సుదీర్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. పూజా కార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం అయింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. కాగా ఆదిలోనే చిత్ర యూనిట్ కి, శర్వానంద్ కు భారీ షాక్ తగిలింది. ఈ చిత్రం కోసం ఎంపిక చేసుకున్న హీరోయిన్లు హ్యాండిచ్చారట. దీనితో కొత్త హీరోయిన్ల వేటలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.
హ్యాండిచ్చిన కాజల్, నిత్యామీనన్
ఈ చిత్రంలో హీరోయిన్స్ గా కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ లని ఎంపికచేశారు. అధికారికంగా కూడా ప్రకటించారు. కానీ అనూహ్యంగా వీళ్ళిద్దరూ ఈ చిత్రం నుంచి తప్పుకున్నారట.
ఏం జరిగింది
కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ ఇద్దరూ సినిమానుంచి తప్పుకోవడంతో అనుమానాలు మొదలయ్యాయి. ఎవరైనా ఒక్క హీరోయిన్ మాత్రమే ఈ చిత్రం నుంచివైదొలిగి ఉంటె వ్యక్తిగత కారణాలు అనుకుని ఉండొచ్చు. కానీ ఇద్దరూ ఒకేసారి తప్పుకోవడంతో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. నిర్మాతలకు హీరోయిన్లకు పారితోషకం విషయంలో చెడిందా అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక పోయి ఉండొచ్చు అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.
సీన్ లోకి వచ్చిన అఖిల్ హీరోయిన్
కాజల్, నిత్యామీనన్ ఇద్దరూ తప్పుకోవడంతో చిత్ర యూనిట్ వేరే హీరోయిన్లని వెతుక్కునే పనిలో పడింది. కాగా నిత్యామీనన్ స్థానంలో హలో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ ని సెలెక్ట్ చేసుకున్నారట. మరొక హీరోయిన్ ని ఎంపిక చేసుకోవలసి ఉంది.
శర్వానంద్ అలాంటి పాత్రలో
శర్వానంద్ ఈ చిత్రంలో డాన్ పాత్రలో కనిపించబోతున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. స్వామిరారా చిత్రంతో విజయాన్ని అందుకున్న సుదీర్ వర్మ ఆ తరువాత దోచెయ్, కేశవ వంటి చిత్రాలని తెరకెక్కించారు.