Don't Miss!
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Finance SBI MF: ప్రైవేట్ బ్యాంక్ దెబ్బతో రూ. 1,200 కోట్లకు పైగా నష్టపోయిన ఎస్బీఐ మ్యుచువల్ ఫండ్..
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అతని దగ్గరే నేర్చుకున్నా.. నెర్వస్గా ఉంది.. ఆయన లేకుంటే: ఆసక్తికర విషయాలు చెప్పిన కాజల్
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ మరికొద్ది రోజుల్లోనే సీతగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఇందులో భాగంగా కాజల్ అగర్వాల్ తన సినిమా విశేషాలను, వ్యక్తిగత విషయాలను చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా డైరెక్టర్ తేజతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని తెలిపే ప్రయత్నం చేసింది కాజల్.
తేజ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీకల్యాణం సినిమాతోనే తెరంగేట్రం చేసింది పంజాబీ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. ఆ సినిమా ఆశించిన ఫలితం రాబట్టనప్పటికీ.. అనతి కాలంలోనే తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగిపోయింది కాజల్. వరుస పెట్టి అన్ని భాషల్లోని స్టార్ హీరోల సరసన ఆడిపాడి అందరికీ సరైన జోడీ అని నిరూపించుకుంది. ఇక తన సినీ ప్రయాణంలో హీరోయిన్గా ఇప్పటికే 50 సినిమాలను పూర్తి చేసుకుంది కాజల్ అగర్వాల్. ఆమె 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమాకు కూడా దర్శకత్వం వహించింది తేజనే కావడం విశేషం. ఇక ఇప్పుడు మూడోసారి తేజ దర్శకత్వంలో సీత చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకొస్తోంది కాజల్.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కాజల్ మాట్లాడుతూ ''మొదటిసారి నెర్వస్గా ఫీల్ అవుతున్నా. నా మెంటర్, గైడ్ అయిన తేజగారు లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్ని కాను. ఆయన స్కూల్లోనే నటిగా చాలా విషయాలను నేర్చుకున్నాను. అలాగే ఇప్పుడు సీత సినిమా రూపంలో నాకు ఆయన వద్దే పిహెచ్డి చేసే అవకాశం దక్కింది'' అని చెప్పింది. మోడ్రెన్ సీతగా విలక్షణ పాత్రలో సీతలో కనిపించనుంది కాజల్. చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించాడు. ఇటీవలే సెన్సార్ పూర్తిచేసుకొని యూ/ ఏ సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా మే 24న విడుదల కానుంది.