Don't Miss!
- News ఈ ఒక్కటి ఇంట్లో ఉంటే డబ్బు ఆటోమేటిక్ గా వస్తుంది
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
కాజల్ కీబోర్డ్ లాంటిది అంటున్న దర్శకుడు
కాజల్ కీబోర్డ్ లాంటిది. ఒక్కో మీటకి ఒక్కో రాగం పలికించగల సృజనశీలి అంటున్నారు ప్రముఖ దర్శకుడు కె.వి.ఆనంద్. ఆయన సూర్య,కాజల్ కాంబినేషన్ లో రూపొందిస్తున్న తాజా చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే..వాస్తవ సంఘటనలతో అల్లుకున్న చిత్రమిది. అందరికీ నచ్చేలా ఉంటుంది. ఎలాంటి పాత్రనైనా పోషించగల సత్తా ఉన్న నటుడు సూర్య. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా అన్నారు. ఇక కాజల్ మాట్లాడుతూ...ఈ చిత్రం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. సూర్యతో పనిచేయడం మర్చిపోలేనని కాజల్ చెప్పింది.
హీరో సూర్య మాట్లాడుతూ ... ప్రేక్షకులకి వినోదాన్ని పంచుతూనే ఆలోచింపచేసే చిత్రమిది. 'అయ్యన్'లో దేవా పాత్రతో నా కెరీర్లో ఓ గొప్ప పాత్రని అందించారు కె.వి.ఆనంద్. తొలిసారి నాకు ఫొటో షూట్ చేసింది కూడా ఆయనే. మా కలయికలో వస్తున్న ఈ కొత్త చిత్రం కచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ప్రతిభగల దర్శకులందరినీ కలిపితే కె.వి.ఆనంద్ తయారయ్యారు. ఈ చిత్రంతో తొలిసారి తెలుగులో స్వయంగా డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉందని అన్నారు.
ఈ చిత్రానికి తెలుగులో 'డూప్లికేట్' అనే పేరును ఖరారు చేసే అవకాశముంది. కె.వి.ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం రైట్స్ ని బెల్లంకొండ సురేష్ చేజిక్కించుకున్నారు. కెవి ఆనంద్ గతంలో జీవా హీరోగా రూపొందిన చిత్రం తెలుగులో 'రంగం'టైటిల్ తో విడుదల చేస్తే మంచి విజయం సాధించింది. అదే స్పూర్తితో సూర్యకి,కెవి ఆనంద్ కి ఉన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని వేసవవిలో భారీగా విడుదల చేయాలని బెల్లంకొండ నిర్ణయించుకున్నారు. సూర్య చిత్రాలు తెలుగులో గతంలో ఇక్కడ మంచి విజయం సాధించటంతో ఈ చిత్రానికి మంచి బిజినెస్ ఆఫర్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో పీటర్ హెయిన్స్ నేతృత్వంలో యాక్షన్ ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, కళ: ఆర్.రాజీవన్, కూర్పు: ఆంథోని, ఛాయాగ్రహణం: సౌందరరాజన్, సంగీతం: హారీష్ జైరాజ్, సమర్పణ: కె.ఇ.జ్ఞాన్వేల్ రాజా.