కాజల్ కొత్త చిత్రం 'ఓం శాంతి' విశేషాలు
కాజల్, నవదీప్, నిఖిల్, బిందు మాధవి, అదితి శర్మ కాంబినేషన్లో త్రి ఏంజిల్స్ పతాకంపై ఓ శాంతి అనే చిత్రం అనే చిత్రం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఎపిసోడిక్ నేరేషన్ లో ఆరు కథలు కలిసి ఓ క్లైమాక్స్ లో ఇంటర్ లింక్ ఉండేలా ఈ కథనం రూపొందుతోంది. ఈ చిత్రం ఆడియోను నవంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రకాష్ అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం అవుతున్నాడు. హాలీవుడ్ లో వచ్చిన క్రాష్ (ఆస్కార్ విన్నింగ్ ఫిల్మ్)తరహాలో ఉంటుందంటున్నారు. ఇక మొదటి చిత్రం బాణం తోనే అభిరుచి ఉన్న నిర్మాతలుగా పేరుతెచ్చుకున్న శేషు ప్రియాంక చలసాని(అశ్వనీదత్ కుమార్తెలు) ఈ చిత్రం నిర్మాతలు కావటంతో మంచి క్రేజ్ వస్తోంది. ఈ చిత్రం లోగో ఆవిష్కరణ నవంబర్ 18 న జరగనుంది.
More from Filmibeat
కాజల్ నవదీప్ నిఖిల్ బిందు మాధవి అదితి శర్మ మగధీర బంపర్ ఆఫర్ గుండె ఝల్లుమంది ఆస్కార్ ఇళయరాజా kajal navdeep bindu madhavi adithi sharma magadheera bumper offer


Click it and Unblock the Notifications











