Don't Miss!
- News ఏపీలో 45 డిగ్రీలను దాటిన టెంపరేచర్: గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది ఇక్కడే
- Sports చరిత్ర సృష్టించిన స్టొయినిస్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
ఫాల్స్ న్యూస్ అంటూ రాజమౌళి ఖండన
రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ లో త్వరలో రూపొందబోయే చిత్రంలో కాజల్ హీరోయిన్ గా నటిస్తోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజమౌళి తన ట్విట్టర్ దానికి సంభందించిన ఖండన ట్వీట్ చేసారు. ఆయన మాటల్లోనే... ప్రభాస్ సినిమాలో కాజల్ ని తీసుకున్నాననేది ఫాల్స్ న్యూస్. ఇప్పటివరకూ ఇంకా నటీనటుల ఎంపిక ప్రారంభించలేదు అన్నారు. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ లో ప్రారంభం కానుంది. రాజమౌళి చిత్రం కోసం ప్రభాస్ సైతం ఏ చిత్రమూ ఒప్పుకోకుండా ప్రస్తుతం చేస్తున్న రెబెల్ చిత్రం పూర్తి చేసి డేట్స్ ఖాళీగా పెట్టుకున్నారు. రెబెల్ చిత్రాన్ని కాంచనతో హిట్టు కొట్టిన లారెన్స్ డైరక్ట్ చేస్తున్నారు.
ఇక ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రం బిజీలో ఉన్నారు. సమంత, నాని జంటగా నటిస్తున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ ప్రధానంగా సాగుతుంది. 'ఈగ" సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే 'తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే 'ఈగ" రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో 'ఈగ"గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై.. అదీ ఓ పరమ క్రూరుడి పై ఆ 'ఈగ"ఎలా గెలిచిందీ.. ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ" అన్నదే క్లుప్తంగా 'ఈగ" కథాంశం.