Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
ధనుష్ కు ప్రతినాయిక కష్టాలు.. వీఐపీ2 లో విలన్ గా బాలీవుడ్ అగ్రనటి
బాలీవుడ్ నటి కాజోల్ మరోసారి దక్షిణాది తెరపై తళుక్కున మెరువనున్నారు. వీఐపీ2లో ధనుష్ పోటీగా విలన్ పాత్రలో కనిపించనున్నారు.
వీఐపీ2లో బాలీవుడ్ అగ్రనటి నటిస్తున్నదని కొద్దిరోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు తెరపడింది. ధనుష్ కు పోటీగా ప్రతినాయిక పాత్రలో బాలీవుడ్ నటి కాజోల్ నటిస్తున్నదని చిత్ర దర్శకురాలు, రజనీకాంత్ కూతురు సౌందర్య తెలిపారు. వారం రోజులపాటు జరిగే షూటింగ్ కోసం కాజోల్ చిత్రం బృందంతో చేరింది.
ఈ సందర్భంగా సౌందర్య మీడియాతో మాట్లాడుతూ.. ధనుష్ ను ఢీకొట్టే వ్యాపారవేత్త పాత్రలో కాజోల్ నటిస్తున్నారు. అంతమాత్రన పూర్తిగా విలన్ గా భావించకూడదు. కాజోల్ తన నటనతో అభిమానులకు కొత్త అనుభూతిని కలిగిస్తారు అని అన్నారు. ఆమె పాత్రలో విభిన్నమైన కోణాలున్నాయని పేర్కొన్నారు. తమిళ చిత్రంలో కాజోల్ నటించడం ఇది తొలిసారి కాదు.
1997లో మిన్సారా కనవు (మెరుపు కలలు) చిత్రంలో అరవింద్ స్వామి, ప్రభుదేవా సరసన నటించారు. వీఐపీ చిత్రంలో పాల్గొన్న తర్వాత కాజోల్ మాట్లాడుతూ మళ్లీ తమిళ చిత్రంలో నటించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. గత నెల తమిళ సూపర్ స్టార్ రజనీ చేతుల మీదుగా చిత్ర ప్రారంభోత్సవం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని కాజోల్ తో ఉన్న మోషన్ పోస్టర్ ను ధనుష్ ట్వీట్ చేశారు.