Don't Miss!
- News పైసాకు పనికిరాని వ్యక్తి పవన్ - చంద్రబాబు..!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
కళాభవన్ మణి కి నివాళి: ఆటో నడిపే మిమిక్రీ ఆర్టిస్ట్...మోస్ట్ వాంటెడ్ విలన్ గా
కొచ్చి:ప్రముఖ నటుడు కళాభవన్ మణి (45) కన్నుమూశారు. కొంతకాలంగా కాలేయ , కిడ్ని సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయనకి భార్య డా.నిమ్మి, కూతురు శ్రీలక్ష్మి ఉన్నారు.
'నటుడు కళాభవన్ శనివారం కొచ్చిలోని అమృత ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచాం. ఆదివారం రాత్రి 7.15గంటల ప్రాంతంలో తుది శ్వాస విడిచారు' అని వైద్యులు తెలిపారు.
మిమిక్రీ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన కళాభవన్.. మలయాళ చిత్ర సీమ నుంచి నట ప్రయాణం మొదలుపెట్టి తెలుగు, తమిళంలోనూ నటించి పేరు తెచ్చుకొన్నారు. తెలుగులో ‘జెమిని' చిత్రంతో ఆయనకు మంచి గుర్తింపొచ్చింది. అందులో పక్షుల్లాగా, జంతువుల్లాగా అనుకరిస్తూ విలన్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.
కళా భవన్ గురించి మరిన్ని విశేషాలు...
తెలుగులో
‘అర్జున్', ‘నరసింహుడు', ‘ఎవడైతే నాకేంటి' చిత్రాల్లోనూ మణి కీలక పాత్రలు పోషించారు.
జెమినీ
ముఖ్యంగా తెలుగులో ఆయన నటించిన చిత్రం అనగానే గుర్తొచ్చేది జెమినీనే.
జెమినీ
జెమినీ సినిమాలో లడ్డా అనే క్యారెక్టర్ తో విలక్షణ విలన్ పాత్ర పోషించిన ఆయన ఆ సినిమా అనగానే లడ్డానే గుర్తు చేసుకునేట్లుగా నటించారు.
కళాభవన్ మణి
కళాభవన్ మణి అసలు పేరు మణిరామన్. కేరళలోని చలక్కుడిలో జన్మించారు.
ఆటోడ్రైవర్గా
స్వతహాగా మిమిక్రీ కళాకారుడైన ఆయన పలు ప్రదర్శనలు ఇచ్చారు. ఒకపక్క మిమిక్రీ ప్రదర్శనలు ఇస్తూ, మరోపక్క ఆటోడ్రైవర్గా పనిచేసేవారు.
తొలి అవకాసం
ఈ సమయంలో ఆయనకి ‘అక్షరం' అనే చిత్రంలో నటించే అవకాశం వచ్చింది.
కంటిన్యూగా..
ఆ చిత్రం తర్వాత 200కిపైగా సినిమాల్లో విలన్ గా, హాస్య నటుడిగా నటించి ప్రేక్షకులకి వినోదాన్ని పంచారు.
అవార్డులు
మలయాళ చిత్రం ‘వసంతియుమ్ లక్ష్మియుమ్ పిన్నే న్యాణుం'లో నటనకిగానూ మణికి జాతీయ పురస్కారం (స్పెషల్ జ్యూరీ) లభించింది.
రాష్ట్ర ప్రభుత్వం నుంచి..
1999లో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఉత్తమ నటుడి అవార్డు కూడా అందుకున్నారు.
సింగర్, సంగీత దర్శకుడు
మణిలో మంచి నటుడితోపాటు నేపథ్యగాయకుడు, సంగీత దర్శకుడూ ఉన్నారు. పలు చిత్రాల్లో గీతాల్ని ఆలపించడంతోపాటు, కొన్ని చిత్రాలకి సంగీతం అందించారు.
స్టోరీ రైటర్ కూడా
ఓ చిత్రానికి కథ అందించారు.
నివాళి
కళాభవన్ మణి మరణంతో దక్షిణాది చిత్రసీమ దిగ్భ్రాంతికి గురైంది. ఆయన కు వన్ ఇండియా తెలుగు నివాళులు అర్పిస్తోంది.