Don't Miss!
- News ముస్లీం రిజర్వేషన్లపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు, మేము వస్తే ఖేల్ కథం !
- Sports IPL 2024: రుతురాజ్ గైక్వాడ్పై అంబటి రాయుడు విమర్శలు.. తప్పుబట్టిన సిక్సర్ల సిద్దు!
- Lifestyle మండిపోయే ఎండలో చల్లగా దద్దోజనాన్ని ఇలా చేసుకోండి..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
‘ఇజం’ బడ్జెట్, అప్పుల విషయమై స్పందించిన కళ్యాణ్ రామ్
హైదరాబాద్: కళ్యాణ్ రామ్ హీరోగా, తాను నిర్మాతగా తెరకెక్కిన చిత్రం 'ఇజం'. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం గ్రాండ్ గా రిలీజైంది. అయితే సినిమా రిలీజ్ ముందు రకరకాల రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి.
సినిమాకు భారీగా రూ. 25 కోట్ల బడ్జెట్ ఖర్చయిందని, సినిమాకు అనుకున్న మేర బిజినెస్ జరుగలేదని, రూ. 5 కోట్ల నష్టానికి అంటే 20 కోట్లకి కల్యాణ్ రామ్ సినిమా హక్కులను అమ్మాడంటూ వార్తలొచ్చాయి. ఓం 3డి తర్వాత కళ్యాణ్ రామ్ అప్పుల్లో మునిగి పోయారనే ప్రచారం కూడా అప్పట్లో జరిగింది.
దీనిపై కళ్యాణ్ రామ్ ఇటీవల ఇంటర్వ్యూలో స్పందించారు. ఇజం సినిమా అంత భారీ బడ్జెట్ ఖర్చు చేయలేదని, కాకపోతే అనుకున్న దాని కన్నా కొంచెం అటూ..ఇటూగా ఖర్చైందని, అది కూడా నా కెరీర్ దృష్టలో పెట్టుకుని, నా కోసం ఖర్చు పెట్టుకున్నదే అన్నారు.
అదే విధంగా తాను అప్పుల్లో ఉన్నాననే వాస్తల్లోనూ నిజం లేదన్నారు. ఒకవేళ తాను ఆర్థికంగా తాను అంతగా దిగజారిపోతే సినిమాలను ఎలా తీయగలను, అలాంటిదేమీ లేదు, అంతా రూమర్స్ అంటూ కల్యాణ్ రామ్ కొట్టిపారేసారు. ఇకపై బయటి బేనర్లలో కూడా సినిమాలు చేస్తానన్నారు.