Don't Miss!
- News కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Technology ఆంధ్రప్రదేశ్ లో 7.9 మిలియన్ల 5G యూజర్ లతో, Airtel మరో రికార్డు! 5G విస్తరణ వివరాలు
- Finance Gold Rate: మిసైల్ వేగంతో పెరిగిన పసిడి.. నిన్న పడింది నేడు పుంజుకుంది..
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పూరి కోసం ..కళ్యాణ్ రామ్ కొత్త లుక్, షాక్ అవుతారు చూస్తే
హైదరాబాద్: తొలి సినిమానుంచీ కళ్యాణ్ రామ్ ఏ సినిమాలో చేసినా పెద్దగా గెటప్ ఛేంజ్ లేకుండా ఒకేలా ఉంటూ వస్తున్నారు. అయితే దర్శకుడు పూరి జగన్నాధ్ మాత్రం దాన్ని బ్రేక్ చేయదలుచుకున్నారు. కళ్యాణ్ రామ్ను పూరీ జగన్నాథ్ స్టయిలిస్ లుక్లో చూపించ దలచుకున్నారు.
ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్లో కనబడనున్నాడు. ఎవరిని చంపాడానికి వస్తున్నాడంటూ కామెంట్ రాసి ఈ ఫొటోను పూరీ జగన్నాథ్ ట్విట్టర్లో పోస్టు చేశాడు.
Take a look at uber cool never seen before trendy @nandamurikalyan who is coming for a kill. pic.twitter.com/oP9aHnDPof
— PURI JAGAN (@purijagan) May 31, 2016
హెయిర్ స్టైల్, గడ్డం.. విషయంలో మార్పు తీసుకువచ్చి.. ఇలా కళ్యాణ్ రామ్ లుక్ను పూర్తిగా మార్చేశారు పూరీ. ఇక ఈ ఫోటోను పూరీ విడుదల చేసిన కొద్దిసేపటికే అన్ని వర్గాల నుంచీ అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ స్వయంగా నిర్మిస్తోన్న ఈ సినిమా పూరీ స్టైల్లో ఓ కమర్షియల్ సినిమాగా తెరకెక్కనుందని తెలుస్తోంది.
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన మిస్ ఇండియా 2015 .. అదితి ఆర్య ని ఎంపిక చేసినట్లు సమాచారం. ఆమె ఓకే చేస్తే ఇదే టాలీవుడ్ లో ఆమె తొలి చిత్రం. ఆమెను కలిసి ఇప్పటికే టీమ్ కథ ని వినిపించిందని తెలుస్తోంది. స్టోరీలైన్ నచ్చిన అదితి , ఈ ప్రాజెక్టులో పాలు పంచుకోవటానికి చాలా ఎక్సైట్మెంట్ తో ఎదురుచూస్తున్నట్లు చెప్పిందని యూనిట్ వర్గాలు చెప్తున్నారు.
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ ..జర్నలిస్ట్ పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పటాస్ లోపోలీస్ గా కనిపించి అలరించిన కళ్యాణ్ రామ్ ...ఈ సినిమాలో జర్నలిస్ట్ గా పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తారని చెప్తున్నారు.
కళ్యాణ్ రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఓ చిత్రం రూపొందనుంది. నందమూరి కళ్యాణ్ రామ్ దీనికి నిర్మాత. 'టెంపర్' తర్వాత పూరి జగన్నాథ్, 'పటాస్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి కథ, కూర్పు, మాటలు, దర్శకత్వం పూరిజగన్నాథే.