Don't Miss!
- Sports SRH vs RCB: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నందమూరి ఫాన్స్ ఎగిరి గంతేసే న్యూస్ : కలసి నటించబోతున్న హరికృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్..!
కళ్యాణ్ రామ్ వరుస చిత్రాలతో జోరుమీద ఉన్నాడు. ఆయన నటించిన ఎమ్మెల్యే, నా నువ్వే చిత్రాలు విడుదల కావాల్సి ఉంది. అంతలోనే మరో చిత్రానికి కళ్యాణ్ రామ్ రెడీ అయిపోతున్నాడు. ఇక్కడ నందమూరి అభిమానులు ఎగిరి గంతేసే విశేషం ఒకటి ఉంది. కళ్యాణ్ రామ్ కొత్త చిత్రంతో హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలసి నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆసక్తి రేపుతున్న ఈ చిత్ర విశేషాలు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
పొలిటికల్ కథతో రెడీగా
కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఎమ్మెల్యే చిత్రంలో నటిస్తున్నాడు. ఆసక్తికరమైన పొలిటికల్ కథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ రాజకీయనాయకుడి పాత్రలో కనిపిస్తుండగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
తమన్నాతో రొమాన్స్
ఎమ్మెల్యే చిత్రానికి సమాంతరంగా కళ్యాణ్ రామ్ మరో చిత్రంలో కూడా నటిస్తున్నారు.మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నా నువ్వే చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే.
వేసవికి వచ్చే ఛాన్స్
ఈ రెండు చిత్రాలు కొద్ది గ్యాప్ లోవేసవి బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యే చిత్ర టీజర్ అభిమానులని ఆకట్టుకుంది.
నెక్స్ట్ మూవీకి ప్లానింగ్
ఈ రెండు చిత్రాలు విడుదల కావాల్సి ఉండగానే కళ్యాణ్ రామ్ మారో సినిమాపై కూడా దృష్టి పెట్టాడు.
ఫాంటసీ కథతో
కళ్యాణ్ రామ్ ప్లానింగ్ చేస్తున కొత్త చిత్రం పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రాన్ని ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందించనున్నట్లు సమాచారం.
తండ్రి కొడుకులు కలసి తొలిసారి
ఇది నందమూరి అభిమానులు ఎగిరి గంతేసే వార్త. ఈ చిత్రంలో రెండు కీలకపాత్రల్లో ఎన్టీఆర్, హరికృష్ణ నటిస్తారని తెలుస్తోంది. దీనితో సోషల్ మీడియాలో అభిమనులు పండగ చేసుకుంటున్నారు. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.
సొంత బ్యానర్ లోనే
కళ్యాణ్ రామ్ స్వయంగా ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో నిర్మిస్తాని సమాచారం.