Don't Miss!
- Sports రికార్డులు బద్దలు కొట్టాలన్నా మేమే.. రికార్డులు సృష్టించాలన్నా మేమే
- Automobiles ఇన్నోవా హైక్రాస్ కొత్త వేరియంట్ వచ్చేసింది - ధర, వివరాలు ఇక్కడ చూడండి
- Finance Dhoni Investment: ఆ కంపెనీపై ఎంఎస్ ధోని పెద్ద పందెం.. పూర్తి వివరాలివే..
- Technology 32MP టెలిఫోటో కెమెరా, 8GB ర్యామ్ Oppo స్మార్ట్ఫోన్పై డిస్కౌంట్.. రూ.2999 తగ్గింపు సహా..!!
- News AP Election Survey: వైసీపీ వర్సెస్ కూటమి పోరులో మొగ్గు వారికే -తేల్చేసిన మరో జాతీయ సర్వే..!
- Lifestyle ఫెయిర్నెస్ క్రీమ్ లు కిడ్నీ సమస్యలను పెంచుతున్నాయి జాగ్రత్త..!
- Travel శ్రీరామనవమి రోజున అయోధ్య రామాలయంలో అద్భుత ఘట్టం...
యూత్ ను ఆకట్టుకోనున్న నా నువ్వే... కళ్యాణ్ రామ్ ఈసారి హిట్ కొట్టబోతున్నాడు!
నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్ తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం నా నువ్వే. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన లభించింది. తమిళ డైరెక్టర్ జయేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మిస్తున్నారు.
నా నువ్వే సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు. కథ నచ్చి ఈ సినిమాను ఈ సినిమా పి.సి.శ్రీరామ్ చేస్తుండడం విశేషం. ఈ చిత్రంలో తమన్నా రేడియో జాకీ పాత్రలో కనిపించనున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్ర ట్రైలర్ ని రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ ను ఆకట్టుకోబోతోందని సమాచారం. సంగీత దర్శకుడు శరత్ అందించిన ఈ సినిమాలోని పాటలు బాగున్నాయి. కళ్యాణ్ రామ్వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈమధ్య ఎంఎల్ఎ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో ప్రస్తుతం సినిమాటోగ్రఫర్ గుహన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.