Don't Miss!
- News క్యూ నిల్చొని ఓటు వేసిన సూపర్ స్టార్
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
యూత్ ను ఆకట్టుకోనున్న నా నువ్వే... కళ్యాణ్ రామ్ ఈసారి హిట్ కొట్టబోతున్నాడు!
నందమూరి కళ్యాణ్ రామ్, హీరోయిన్ తమన్నా జంటగా నటిస్తోన్న తాజా చిత్రం నా నువ్వే. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమాలోని పాటలకు మంచి స్పందన లభించింది. తమిళ డైరెక్టర్ జయేంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిరణ్ ముప్పవరపు, విజయ్ వట్టికూటి నిర్మిస్తున్నారు.
నా నువ్వే సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఛాయాగ్రహణం వహిస్తున్నారు. కథ నచ్చి ఈ సినిమాను ఈ సినిమా పి.సి.శ్రీరామ్ చేస్తుండడం విశేషం. ఈ చిత్రంలో తమన్నా రేడియో జాకీ పాత్రలో కనిపించనున్నట్లు టీజర్ ద్వారా అర్థమవుతోంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ చిత్ర ట్రైలర్ ని రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్ ను ఆకట్టుకోబోతోందని సమాచారం. సంగీత దర్శకుడు శరత్ అందించిన ఈ సినిమాలోని పాటలు బాగున్నాయి. కళ్యాణ్ రామ్వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈమధ్య ఎంఎల్ఎ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హీరో ప్రస్తుతం సినిమాటోగ్రఫర్ గుహన్ దర్శకత్వంలో నటిస్తున్నాడు.