Don't Miss!
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘ఓం’ : దర్గాలో ప్రత్యక్షమైన కళ్యాణ్ రామ్
కడప జిల్లా పెద్ద దర్గాను సందర్శించడం సినిమా వాళ్లకి ఎప్పటి నుండో ఓ సెంటిమెంటుగా మారింది. గతంలో పలు మార్లు టాలీవుడ్, బాలీవుడ్ పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఈ దర్గాను సందర్శించారు. ముఖ్యంగా ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ దర్గాకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వస్తారు.
'ఓం' సినిమా వివరాల్లోకి వెళితే...
కృతి కర్బందా, నికీషా పటేల్ హీరోయిన్స్. సునీల్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్పై కళ్యాణ్ రామే నిర్మిస్తున్నారు. 3డిలో రూపొందుతున్న 'ఓం' ఈ చిత్రానికి హాలీవుడ్ చిత్రాలైన స్టెప్ అప్ 3డి, ఫైనల్ డెస్టినేషన్, అవతార్, స్పైడర్ మ్యాన్ 4 లాంటి చిత్రాలకు పని చేసిన టెక్నీషన్స్ పని చేస్తున్నారు. ఆచు, సాయి కార్తీ సంగీతం అందించారు.
దాదాపు 20 కోట్ల పైచిలుకు ఖర్చుతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కళ్యాణ్ ఉన్న మార్కెట్ కంటే ఇది అధిక మొత్తం. అయినా సరే సక్సెస్ అవుతుందనే నమ్మకంతో సాహసోపేతంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో కార్తీక్, సురేష్, రావు రమేష్, రఘు, సితార తదితరులు నటించారు. కూర్పు: గౌతమ్రాజు, కళ: కిరణ్, స్టీరియోగ్రాఫర్స్: డేవిడ్ మైక్టేలర్, మార్కస్, మజ జ్డోవిన్స్కీ; ఫైట్స్: విజయ్, రవివర్మ; సంగీతం: అచ్చు, సాయికార్తీక్.