Don't Miss!
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- News ఆ ఘటన కలచివేసింది: వైసీపీ సోషల్ మీడియా భేటీలో జగన్: విశాఖ కేంద్రంగా
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
- Finance IPO News: ఐపీవో బంపర్ లిస్టింగ్.. తొలిరోజే అప్పర్ సర్క్యూట్ తాకి భారీ లాభాలు.. కొన్నారా..
ఆ ఉద్దేశంతోనే త్రీడీ చిత్రంలో నటించాను : కల్యాణ్రామ్
హైదరాబాద్ : ''విభిన్నమైన ప్రయత్నం చేసిన ప్రతీసారీ విజయం దక్కింది. ప్రేక్షకులకు కొత్త తరహా అనుభూతిని కలిగించాలనే ఉద్దేశంతోనే త్రీడీ చిత్రంలో నటించాను'' అన్నారు నందమూరి కల్యాణ్రామ్. ఆయన హరోగా నటించిన త్రీడీ చిత్రం 'ఓమ్'. కృతికర్బందా, నికీషా పటేల్ హీరోయిన్స్. సునీల్రెడ్డి దర్శకత్వం వహించారు. నందమూరి తారక అద్విత నిర్మాత. ఈ నెల 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.
అలాగే -''అన్ని రకాల ప్రేక్షకులనూ అలరించేలా ఈ చిత్రం రూపొందింది. నా కెరీర్లోనే ఈ సినిమా ఓ స్పెషల్ ఎట్రాక్షన్గా నిలుస్తుంది. అంచనాలను మించేలా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు. అచ్చు, సాయికార్తీక్ స్వరపరిచిన ఈ చిత్రం పాటల్ని ఇటీవలే విడుదల చేశాం. మంచి స్పందన లభిస్తోంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అందరికీ నచ్చుతుందని నా నమ్మకం'' అన్నారు.
ఇక హాలీవుడ్కి చెందిన సాంకేతిక నిపుణుల్ని 'ఓం' చిత్రం కోసం వినియోగించుకొన్నాం. పలు ఆంగ్ల చిత్రాలకు పనిచేసిన స్టీరియోగ్రాఫర్లు డేవిడ్ మైక్ టేలర్, మార్కస్, మాజాడోన్స్కీలు 'ఓమ్'కి పని చేశారు. వారి ఆధ్వర్యంలో త్రీడీ చిత్రం చేయడం నటుడిగా మరచిపోలేని అనుభవాన్నిచ్చింది. కథాపరంగా ప్రేక్షకులు అటు ఉత్కంఠనీ ఇటు వినోదాన్ని సమపాళ్లలో పొందుతారు అన్నారు కల్యాణ్ రామ్ .
''తెలుగులో తెరకెక్కిన మొట్టమొదటి యాక్షన్ త్రీడీ చిత్రమిది. ప్రేక్షకులకు విభిన్న తరహా వినోదాన్ని అందించాలన్న ఆలోచనలో భాగంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. నిర్మాణ విలువల్ని దృష్టిలో ఉంచుకొని భారీ వ్యయాన్ని కేటాయించాం అన్నారు. కార్తీక్, సురేష్, రావు రమేష్, రఘు, సితార తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా: అజయన్ జోసఫ్ విన్సెంట్, ఎడిటింగ్: గౌతంరాజు, స్టీరియో గ్రాఫర్స్: డేవిడ్ మైక్ టేలర్, మార్కస్ మాజాడోన్స్కీ, నిర్మాణం: ఎన్టీఆర్ ఆర్ట్స్.