Don't Miss!
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
భారతీయుడు 2 సెట్లో ప్రమాదం.. కోటి విరాళం ప్రకటించిన కమల్
యూనివర్సల్ హీరో కమల్ హాసన్, భారతీయ చలన చిత్రం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలని భావించిన ఈ ద్వయం గతేడాది ఇండియన్ 2ను పట్టాలెక్కించింది. అయితే ఏ ముహూర్తాన వీరు ఆ చిత్రాన్ని మొదలు పెట్టారో గానీ ఆటంకాలు ఎదురువుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్ సెట్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
చెన్నైలో షూటింగ్
ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్ చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతోంది. ఈ మేరకు లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో సెట్ను డిజైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి కింద పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
ముగ్గురు వ్యక్తులు దుర్మరణం..
ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. దాదాపు పదిమంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్బాయ్ ఉన్నారని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందినట్లు ప్రెస్ నోట్ విడుదల చేసింది.
ఉలిక్కిపడ్డ టాలీవుడ్, కోలీవుడ్
ఈ ఘటనకు సంబంధించిన వార్త తెలియగానే.. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఉలిక్కిపడ్డాయి. కేవలం తమిళ నటులే కాదు.. తెలుగు సినీ ప్రముఖులు సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, ధనుష్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
కోటి విరాళం ప్రకటించిన కమల్..
ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కమల్ హాసన్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. ఈ ఘటనతో షాక్ తిన్న చిత్రయూనిట్ కొన్ని రోజుల పాటు షూటింగ్ను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.