Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సహించాల్సిన అవసరం లేదు: అసహనం అంశంపై కమల్
హైదరాబాద్: అసహనం అంశంపై ప్రముఖ నటుడు, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తనదైన రీతిలో స్పందించారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో భారతీయ విద్యార్థులతో జరిగిన ఓ సెమినార్లో ఆయన ఓ విద్యార్థి నుండి అసహనం అంశంపై ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
అసలు ‘సహనం' అన్న పదమే సరికాదని కమల్ స్పష్టం చేసారు. ఒకరిమీద ఒకరు ‘సహనం'చూపించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఒకరినొకరు అంగీకరిస్తే చాలన్నారు. భారత భిన్న సంస్కృతుల సమాహారమని స్పష్టం చేశారు. అసలు ఒకరి మీద మనం ఎందుకు సహనం చూపించాలి? ముస్లింలను మన సహపౌరులుగా అంగీకరించాలి. వారిమీద సహనం చూపించనవసరం లేదు. అదే విధంగా హిందువులనూ అంగీకరించాలి. అప్పుడే దేశం ముందుకెళుతుంది'' అని స్పష్టం చేశారు.
వాక్స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, మతం, స్వేచ్ఛ, విద్య తదితర అంశాలపై కమల్ తన అభిప్రాయాలను సూటిగా వెల్లడించారు. ‘మూడు రంగుల దారాలతో భారత అనే స్వెట్టర్ను అల్లారు. దాని చేతులు(పాకిస్థాన్, బంగ్లదేశ్) ఇప్పటికే పోయాయి. మిగిలి స్లీవ్లెస్ స్వెటర్లోంచి ఆకుపచ్చ ని దారాన్ని వేరు చేయడం సాధ్యంకాదు. మిగిలిన దేశాన్నైనా ఐక్యంగా, సుస్థిరంగా ఉంచేలా అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది' అని కమల్ చెప్పారు.