Don't Miss!
- Sports DC vs RR: రిషభ్ పంత్ విధ్వంసం.. ఒకే ఓవర్లో 31 పరుగులు! వీడియో
- News కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం: ఒకదానికొకటి 8 వాహనాలు ఢీ
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
అందుకే రాజశేఖర్ కి కమిలినీ ముఖర్జీ ఓకే చెప్పింది
ఆనంద్ చిత్రంతో పరిచయమైన కమిలినీ ముఖర్జీ కెరీయర్ ఊహించినంత వేగంగా పరుగెత్తలేదు. ధానికి కారణం ఆమె కథ విని సినిమా డేట్స్ కేటాయించేలోపే సినిమా షూటింగ్ లు పూర్తవటం. అంటే అంత లేటుగా ఆమె నిర్ణయాలు తీసుకుంటూంటుంది. దాంతో తెలిసున్న వారెవరూ ఆమె జోలికి వెళ్ళటం మానేసారు. అలా పూర్తి ఖాలీగా మారిపోయిన ఆమె తన తప్పు తెలుసుకుందో ఏమో గానీ ఇప్పుడు వచ్చిన ఆఫర్ ని వదులుకునేటట్లు కనపడటంలేదు. వెంకటేష్ (చంద్రముఖి-2) సరసన ఐదుగురు హీరోయిన్స్ లో ఒకరిగా ఒప్పుకున్న ఆమె తాజాగా రాజశేఖర్ కొత్త చిత్రం మా అన్నయ్య బంగారం చిత్రంకి కమిట్ అయింది. సాధారణంగా రాజశేఖర్ అంటే హీరోయిన్స్ ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తారు. అయితే కెరిర్ కసి మీద ఉన్న కమిలినీ ఈ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.
రాజశేఖర్ హీరోగా 'మా అన్నయ్య బంగారం' చిత్రం హైదరాబాద్లో సోమవారం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దాసరి నారాయణరావు క్లాప్నిచ్చారు. డి.రామానాయుడు గౌరవ దర్శకత్వం వహించారు. జొన్నలగడ్డ శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. నట్టికుమార్ నిర్మాత. ఈ "ఆరుగురు తమ్ముళ్లకు అన్నగా రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ నెల 12 నుంచి ఒకే షెడ్యూల్లో సినిమాను పూర్తి చేస్తాం. స్విట్జర్లాండ్లో పాటల్ని తెరకెక్కిస్తామ"ని దర్శకుడు చెప్పారు. జులైలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, బాలినేని శ్రీనివాసరెడ్డి, ముఖేష్ గౌడ్, సినీ ప్రముఖులు కృష్ణంరాజు, శ్రీహరి, ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. కథ: భూపతి రాజా, మాటలు: పరుచూరి బ్రదర్స్, ఛాయాగ్రహణం: డి.ప్రసాద్బాబు, కూర్పు: గౌతంరాజు, సంగీతం: ఎస్.ఎ.రాజ్కుమార్.