Don't Miss!
- News ఉండి టీడీపీలో వార్ - మారుతున్న లెక్కలు, ఆడియో వైరల్..!!
- Finance Stock Market: ప్లాట్ గా స్టాక్ మార్కెట్లు.. టెక్ మహీంద్రాలో భారీ కుదుపు..!
- Lifestyle ప్రపంచంలోనే అత్యంత పోషకమైన వేచూర్ ఆవు పాలు: గిన్నీస్ రికార్డ్ సాధించిన ఈ ఆవు గురించి ఆసక్తికరమైన విషయాలు
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మొదట ఎయిడ్స్ తోనే..కమిలినీ ముఖర్జి
ఓ యాడ్లో నన్ను చూసిన నటి, దర్శకురాలు రేవతి తన 'ఫిర్ మిలేంగే' సినిమాలో శిల్పాశెట్టి చెల్లెలి పాత్రకు తీసుకున్నారు. వెండి తెర మీద అదే మొదటిసారి కనిపించడం. ఎయిడ్స్ నేపథ్యం కథతో తీసిన ఆ చిత్రానికి ఎన్నో అవార్డులు వచ్చాయి అంటూ తన తొలి సినిమా ఎంట్రీ గురించి చెప్పుకొచ్చింది కమిలిని ముఖర్జి. తాజాగా ఆమె నటించిన రామా చారి వీడో పెద్ద గూఢాచారి చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.
అలాగే శేఖర్ కమ్ముల ఆనంద్ లో ఆఫర్ వచ్చిన విధానం గుర్తు చేసుకుంటూ... "నాకు కవిత్వం రాసే అలవాటుంది. నేను రాసిన ఓ కవిత అంతర్జాతీయ కవితల పోటీకి ఎంపికైంది కూడా. అంతేకాక వాషింగ్టన్లో దలైలామా నిర్వహించిన సెమినార్కి ప్రపంచవ్యాప్తంగా ఆహ్వానం లభించిన 150 మందిలో నేనూ ఒకదాన్ని. కానీ అదే సమయంలో శేఖర్ కమ్ముల 'ఆనంద్' సినిమాలో రూప పాత్రని ఆఫర్ చేశారు. దాంతో కాస్త సందిగ్ధం. చివరకి సినిమా వైపే మొగ్గుచూపా అని అప్పటి పరిస్థితిని గుర్తు చేసుకుంది. ఇక 'గోపి గోపిక గోదావరి' తర్వాత వేణుతో తను నటించిన 'రామాచారి' సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణని పొందుతుందనేది నమ్మకం వ్యక్తం చేసింది.