Don't Miss!
- News పవన్ చేతిలో జాతీయ జెండా.. ! పిఠాపురంలో కోడ్ ఉల్లంఘన ?
- Sports T20 వరల్డ్ కప్కు భారత తుదిజట్టు ఇదే - సెహ్వాగ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
కమిలినీ ముఖర్జీ కొత్త చిత్రం ప్రారంభం
కమిలినీ ముఖర్జీ, వేణు జంటగా నిర్మించే తాజా చిత్రం షూటింగ్ గురువారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. ఈ చిత్రానికి జి.ఈశ్వర్ దర్శకుడు. దేవుడి ఫొటోలపై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు దర్శకుడు ఇవివి సత్యనారాయణ క్లాప్ నివ్వగా, చిత్ర నిర్మాత పివి శ్యామ్ ప్రసాద్ కెమేరా స్విచ్ఆన్ చేశారు. హీరోయిన్ కమలినీ ముఖర్జీ గౌరవ దర్శకత్వం వహించారు. గతంలో స్వయంవరం', 'చిరునవ్వుతో', '10 క్లాస్', 'కళ్యాణరాముడు' తదితర చిత్రాలను నిర్మించిన ఎస్.పి.ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.
ఈ సందర్భంగా నిర్మాత పివి శ్యామ్ ప్రసాద్ చిత్ర విశేషాలు తెలుపుతూ...'మలయాళంలో హిట్ అయిన 'సిఐడి మూస' చిత్రం ఆధారంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాం. ఆద్యంతం వినోదాన్ని పంచుతూ చిన్న ఫీల్ తో సినిమా పూర్తవుతుంది. జూలై మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం' అన్నారు.
హీరో వేణు మాట్లాడుతూ 'నా మాతృసంస్థలో చిన్న గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. వినోదానికి పెద్ద పీట వేస్తూ ఫుల్లెంగ్త్ ఎంటర్టైనర్గా చిత్రం ఉంటుంది. ఇంతవరకూ నేను చేయని పాత్ర ఇందులో చేస్తున్నాను' అన్నారు.
బ్రహ్మానందం, ఆలీ, కోట, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాష్ రెడ్డి, గిరిబాబు, ఎల్.బి. శ్రీరామ్, రఘుబాబు తదితరులు నటించే ఈ చిత్రానికి కథా విస్తరణ: ఎన్.వి.వి. చౌదరి, బి.సుమంత్, మాటలు: విక్రమ్రాజ్, డుంగ్రోత్ నాగరాజు నాయక్, పాటలు: రామజోగయ్యశాస్త్రి, సంగీతం: మణిశర్మ, ఫొటోగ్రఫీ: కె.ప్రసాద్, నిర్మాత: పి.వి. శ్యామ్ ప్రసాద్, దర్శకత్వం: జి. ఈశ్వర్.