Don't Miss!
- News Chengicherla: రాజా సింగ్ హౌస్ అరెస్ట్, బండి సంజయ్పై కేసు నమోదు
- Sports RR vs DC: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్.. ఒకే ఒక్కడిగా..!
- Lifestyle ఎన్నికల ముందు ప్రచారంలో గాల్లో మేడలు కడుతున్న నాయకులు..
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
వెంకటేష్ సరసన కమిలినీ ముఖర్జీ
వెంకటేష్ తాజా చిత్రం ఆప్త రక్షక రీమేక్ లో కమిలినీ ముఖర్జీ ఎంపికయినట్లు సమాచారం. పి.వాసు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో అనూష్క మెయిన్ హీరోయిన్ గా చేస్తోంది. అనూష్క రేటు ఎక్కువ చెప్పిందని అనూష్క శర్మను ట్రై చేస్తే ఆమె డేట్స్ ఖాళీలేవని తెలిసింది. దాంతో తిరిగి అనూష్కనే అవకాశం వరించింది. ఇక శ్రధ్దాదాస్, రిచా గంపోపాద్యాయ, పూనం కౌర్ లు కూడ వెంకటేష్ ప్రక్కన చేయనున్నారు. మరో హీరోయిన్ ని కూడా ఎంపిక చేయాలని చూస్తున్నారు. ప్రియమణి ఆ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంది. ఇక బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మే నెల నుంచి ప్రారంభం కానుంది. ఇక ఆనంద్ తో తెలుగు తెరకు పరిచయమైన కమిలినీ ముఖర్జీ ఆ తర్వాత గోదావరి, హ్యాపీడేస్ లలో చేసింది. అలాగే హాస్య చిత్రం బ్రహ్మానందం డ్రామా కంపెనీలో కూడా కీలకమైన పాత్ర చేసింది. అలాగే గమ్యంలో ఆమె చేసిన పాత్ర ఆమెకు పేరు తేవటమే కాకుండా ఇతర భాషల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అయితే వెంకటేష్ తో చేయటం మాత్రం ఇదే తొలిసారి.