Don't Miss!
- News కాలేజ్ క్యాంపస్ లో పోలిటికల్ లీడర్ కూతురి హత్య, కన్న కూతుర్ని ఎవరు ఎలా చంపారో చెప్పిన లీడర్ !
- Finance Amazon News: అమెజాన్ సీక్రెట్ స్టోర్.. ప్రాజెక్ట్ క్యూరియాసిటీ వివరాలివే..
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
- Technology Samsung నుంచి 'Music Frame' స్పీకర్ లు లాంచ్! ప్రత్యేకతలేంటి. ధర వివరాలు
- Sports భారత్.. టీ20 వరల్డ్ కప్ 2024 కొట్టాలంటే: లెజెండరీ ప్లేయర్ సలహా
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
‘కాంచన’ రైట్స్ కొన్న సంజయ్ లీలా భన్సాలీ
హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ ఇటీవల పలు తెలుగు హిట్ చిత్రాల రైట్స్ తీసుకుని వాటిని హిందీలో రీమేక్ చేసే ఆలోచన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సంజయ్ లాలా భన్సాలీ తెలుగు కామోడీ హారర్ మూవీ 'కాంచన' హిందీ రీమేక్ రైట్స్ కొన్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రాన్ని తెలుగులో లారెన్స్ స్వయంగా దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా కూడా నటించారు. హిందీ వెర్షన్కు కూడా లారెన్సే దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది. అయితే హీరోగా ప్రముఖ బాలీవుడ్ హీరోను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారట భన్సాలీ. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రస్తుతం లారెన్స్....కాంచన చిత్రానికి సీక్వెల్గా ముని-3 చిత్రాన్ని తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడు. ఈచిత్రం కూడా లారెన్స్ స్వీయ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈచిత్రంలో లారెన్స్ సరసన తాప్సీ హీరోయిన్గా ఎంపికయింది. గత సంవత్సరమే ఈ చిత్ర ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.
శ్రీ గణేష్ ప్రొడక్షన్స్ పతాకంపై మల్టీ డైమన్షనల్ అధినేత రజిత్ పార్థసారథి సమర్పణలో నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ... 'కాంచన' సినిమా సమయంలోనే తన బ్యానర్ లో ఓ సినిమా చేసిపెడతానని లారెన్స్ తనకి మాట ఇచ్చారనీ, దానిని ఇప్పుడిలా నిలబెట్టుకున్నారని చెప్పారు. 'కాంచన' సినిమా తనకి మంచి లాభాలు తెచ్చి పెట్టిందనీ, అలాగే ఈ సినిమా కూడా ఆ స్థాయి విజయాన్ని అందుకుంటుందనే నమ్మకముందని అన్నారు.
దర్శకుడు లారెన్స్ మాట్లాడుతూ.... ఈ చిత్రం కాంచన తరహాలోనే ఎంటర్టైన్ చేస్తుందని, ఓ వైపు నవ్విస్తూనే... భయపెడుతుందని చెప్పుకొచ్చారు. లారెన్స్, తాప్సీ, బ్రహ్మానందం, శ్రీమాన్, అలీ, కోవై సరళ నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం విజయ్ ఆంటోని, సినిమాటోగ్రఫీ: కృష్ణ స్వామి, నిర్మాత: బెల్లంకొండ సురేష్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాఘవ లారెన్స్.