Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
ప్రభాస్ హీరోయిన్ ని అడ్డుకున్న ముఠా
హైదరాబాద్: ప్రభాస్ తో ఏక్ నిరంజన్ చిత్రంలో చేసిన కంగనా రనౌత్ గుర్తుందా... ఆమె తాజాగా చంబల్ లోయలో ఓ ముఠా మనుష్యుల మధ్య ఇరుక్కుంది. దోపిడీ దొంగలు ఎక్కువగా తిరిగే ఆ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా 'రివాల్వర్ రాణి' అనే హిందీ చిత్రం షూటింగ్ కి హాజరువుతోంది. సాయి కబీర్ దర్శకుడు గా రూపొందుతున్న ఈ చిత్రం యాక్షన్ ఎడ్వెంచర్ గా సాగుతోంది.
ఆ లోయలో కంగన షూటింగ్ ముగించుకొని వెనుదిరిగిన సమయంలో ఓ ముఠా సినిమావాళ్లను అడ్డుకొంది. కంగన వాహనంలోంచి కిందికి దిగాలని గొడవ చేశారు. ఆమెతో ఫొటోలు దిగేవరకు వాహనాల్ని కదలనిచ్చే ప్రసక్తే లేదన్నారు. దర్శకుడు దిగి ఆ ముఠాతో మాట్లాడి బయటపడ్డారు.
ఈ విషయం గురించి దర్శకుడు మాట్లాడుతూ ''ఆ ప్రాంతంలో నేను పదిహేనేళ్లు నివసించాను. ఇలాంటి ప్రమాదం తలెత్తుతుందని ముందే వూహించాను. అందుకే మా జాగ్రత్తల్లో మేం ఉన్నాం. చంబల్ లోయ ప్రాంతం ఆయుధాలకు, బందిపోటు దొంగలకీ పెట్టింది పేరు. పెద్దగా కారణాలు లేకపోయినా సరే కాల్పులు జరుపుతుంటారు. కంగన మాత్రం వాహనం నుంచి కిందికి దిగలేదు. ఓ పోలీసు వాహనం కూడా మాకు రక్షణగా వచ్చింది''అని తెలిపారు.
మరో ప్రక్క ఆమె తాజాగా వ్యభిచారిగా కనిపించనుంది. విశ్వాస్ పాటిల్ 'ట్రావెల్డ్ ఎక్రాస్ ది బోర్డర్' చిత్రంలో కంగన వ్యభిచారిణి పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం కోసం దర్శకనిర్మాతలు తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. వ్యభిచార గృహాల కేంద్రకమైన లాహోర్ హీరామండీ సెట్స్ని ముంబైలో యథాతథంగా వేసి సినిమాని చిత్రీకరించనున్నారు. మరోప్రక్క ఈ భామ దర్శకత్వం వైపు అడుగులు వేస్తోంది. ఓ షార్ట్ ఫిల్మ్ ద్వారా కంగనా దర్శకురాలి అవతారం ఎత్తబోతోంది.