Don't Miss!
- Finance Amitabh Kant: 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్..
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
- Automobiles ముంబయి- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కోసం ‘బాలస్ట్లెస్' ట్రాక్.. దీని ప్రత్యేకతలు తెలుసా.??
- News ఎన్నికల వేళ ధర్మవరం లో నువ్వా -నేనా, సై..!!
- Travel గుడ్ప్రైడే రోజున లాంగ్వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్లు చూసేయండి...
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కంగన రనౌత్ మెడకు ‘టెర్రిరిస్టు’ వ్యాఖ్యల వివాదం.. క్రిమినల్ కేసు నమోదు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులపై ఆందోళన, నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను ఉద్దేశించి బాలీవుడ్ నటి కంగన రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మీడియాలో దుమారం సృష్టించాయి. ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కర్ణాటకలోని తుమ్కురు జేఎంఎఫ్సీ కోర్టులో కేసు నమోదైంది. రైతులను ఉద్దేశించి కంగన రనౌత్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారంటే..
కంగన చేసిన ట్వీట్ ఏమిటంటే..
ప్రధాని మోదీ సర్కార్ ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టింది. అయితే రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందంటూ రైతులు రోడ్లెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. రైతుల చేస్తున్న ఆందోళనపై కంగన ట్వీట్ చేస్తూ. .కొందరు టెర్రిరిస్టులు రైతుల ముసుగులో ధర్నాలు చేస్తున్నారు అని కామెంట్ చేశారు.
ఆ టెర్రరిస్టులే రైతులుగా
గతంలో సీఏఏ బిల్లులను వ్యతిరేకిస్తూ ఎవరైతే మత ఘర్షణలకు కారణమయ్యారో అందులోని కొందరు ఇప్పుడు రైతు ఉద్యమంలో చేరారు. ఆ టెర్రరిస్టులే ఇప్పుడు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ కంగన మండిపడ్డారు. అందులో కొందరు రాజకీయ నేతలు కూడా ఉన్నారంటూ కామెంట్ చేశారు.
కంగన రనౌత్ వివరణ ఇలా
అయితే రైతు ధర్నాలను, నిరసనలను ఉద్దేశించి చేసిన ట్వీట్ వివాదంగా మారడంతో తాను ఏమన్నాననే విషయాన్ని కంగన మరో ట్వీట్లో స్పష్టం చేశారు. రైతులను ఉద్దేశించి తాను వ్యాఖ్యలు చేయలేదు. సీఏఏ అల్లర్లకు కారణమైన కొందరే కుట్రకు పాల్పడుతున్నారనే విధంగా కామెంట్ చేశారు.
Recommended Video
కర్ణాటకలో నమోదైన కేసు ఇదే..
కంగన ట్వీట్ ద్వారా చేసిన వ్యాఖ్యలను ఆధారంగా కర్ణాటక తూమ్కూరు కోర్టులో కేసు నమోదు చేశారు. కంగనపై చేసిన ఫిర్యాదు ఆధారంగా ఆమెపై ఐపీసీ సెక్షన్ 44, 108, 153, 153A, 504 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ క్రిమినల్ కేసుపై కంగన ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.