Don't Miss!
- Sports హేటర్స్ ఎంతకు తెగించారు: చివరికి హార్దిక్ పాండ్యా వైఫ్ను కూడా
- News కాంగ్రెస్ వరంగల్ ఎంపీ టికెట్ ఎవరికి? కుమార్తెతో సహా కడియం శ్రీహరి జంప్తో చర్చ!!
- Finance RBI: 2000 నోట్లపై కీలక ప్రకటన చేసిన ఆర్బీఐ..
- Technology 50MP సెల్ఫీ కెమెరా తో Samsung కొత్త ఫోన్! లాంచ్,ధర వివరాలు
- Automobiles ప్రపంచంలోనే 'ది బెస్ట్ కారు' ఇదే.. 29 దేశాల నుంచి 100 మంది ఆటో మొబైల్ జర్నలిస్ట్లు ఎంపిక చేసిన కారు ఏదంటే??
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
సంక్రాంతి విడుదల చిత్రంపై కధా చౌర్యం కేసు
తాను 20 ఏళ్లుగా ప్రముఖ దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పని చేస్తున్నానని తెలిపారు. తాను అంబుళ్ల శింబు అనే పేరుతో ఒక కథను తయారు చేసుకున్నానని పేర్కొన్నారు. ఈ కథను తన స్నేహితుడు, నటు డు శ్రీనాథ్కు వినిపించానని తెలిపారు. ఆయన హాస్యనటుడు సంతానంకు చెప్పి చిత్ర నిర్మాణానికి సహాయం చేయాలని కోరారన్నారు. తాను బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్ర షూటింగ్ సమయంలో తన కథను సంతానంకు వినిపించానన్నారు.
ఈ కథను శింబు హీరోగా తెరకెక్కిం చాలని భావించానని, అందుకు సంతానం సహాయం చేస్తాననడంతో స్కిప్ట్రును ఆయనకు ఇచ్చానని చెప్పారు. అలాంటిది సంతానం తన అనుమతి లేకుండా తన కథతో కన్నా లడ్డు తిన్న ఆశయా పేరుతో చిత్రాన్ని రూపొందించారని ఆరోపించారు. ఈ విషయమై సంతానంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన తనను దూరం చేస్తూ వచ్చారని తెలిపారు. తన కథతో చిత్రాన్ని రూపొందించిన సంతానంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సంతానంతో పాటు పవర్స్టార్ శ్రీనివాసన్ తదితరు నటించిన ఈ చిత్రాన్ని సంతానం, రామనారయణన్ సంయుక్తంగా నిర్మించారు. సంతానం ఈ విషయమై విషయం సెటిల్ చేసుకుని విడుదల చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 'కన్నా లడ్డు తిన్న ఆశయా' విడుదల అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.