Don't Miss!
- News Modi-Hanuman Chalia:హనుమాన్ ఛాలీసాపై ప్రధాని మోదీ వివాదాస్పద వ్యాఖ్యలు..!
- Finance Banking News: ప్రభుత్వ బ్యాంకులకు ఆ అధికారం లేదు.. బాంబే హైకోర్టు సంచలన తీర్పు..
- Automobiles వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- Sports IPL: నైట్ అంతా సిట్టింగ్ వేస్తే ఎలా గెలుస్తారు?- రైనా
- Technology అద్భుతమైన డిజైన్ తో నోకియా కొత్త ఫోన్ Nokia N90 Flip ! వివరాలు
- Lifestyle నిద్రపోకపోతే వచ్చే సమస్యలివే.. తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిశోధకులు..!
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
సంక్రాంతి విడుదల చిత్రంపై కధా చౌర్యం కేసు
తాను 20 ఏళ్లుగా ప్రముఖ దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పని చేస్తున్నానని తెలిపారు. తాను అంబుళ్ల శింబు అనే పేరుతో ఒక కథను తయారు చేసుకున్నానని పేర్కొన్నారు. ఈ కథను తన స్నేహితుడు, నటు డు శ్రీనాథ్కు వినిపించానని తెలిపారు. ఆయన హాస్యనటుడు సంతానంకు చెప్పి చిత్ర నిర్మాణానికి సహాయం చేయాలని కోరారన్నారు. తాను బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్ర షూటింగ్ సమయంలో తన కథను సంతానంకు వినిపించానన్నారు.
ఈ కథను శింబు హీరోగా తెరకెక్కిం చాలని భావించానని, అందుకు సంతానం సహాయం చేస్తాననడంతో స్కిప్ట్రును ఆయనకు ఇచ్చానని చెప్పారు. అలాంటిది సంతానం తన అనుమతి లేకుండా తన కథతో కన్నా లడ్డు తిన్న ఆశయా పేరుతో చిత్రాన్ని రూపొందించారని ఆరోపించారు. ఈ విషయమై సంతానంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన తనను దూరం చేస్తూ వచ్చారని తెలిపారు. తన కథతో చిత్రాన్ని రూపొందించిన సంతానంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సంతానంతో పాటు పవర్స్టార్ శ్రీనివాసన్ తదితరు నటించిన ఈ చిత్రాన్ని సంతానం, రామనారయణన్ సంయుక్తంగా నిర్మించారు. సంతానం ఈ విషయమై విషయం సెటిల్ చేసుకుని విడుదల చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 'కన్నా లడ్డు తిన్న ఆశయా' విడుదల అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.