Don't Miss!
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- News టీడీపీ అభ్యర్దుల మార్పు, ఎవరెక్కడ - రఘురామ పై తాజా నిర్ణయం..!!
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
సంక్రాంతి విడుదల చిత్రంపై కధా చౌర్యం కేసు
తాను 20 ఏళ్లుగా ప్రముఖ దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పని చేస్తున్నానని తెలిపారు. తాను అంబుళ్ల శింబు అనే పేరుతో ఒక కథను తయారు చేసుకున్నానని పేర్కొన్నారు. ఈ కథను తన స్నేహితుడు, నటు డు శ్రీనాథ్కు వినిపించానని తెలిపారు. ఆయన హాస్యనటుడు సంతానంకు చెప్పి చిత్ర నిర్మాణానికి సహాయం చేయాలని కోరారన్నారు. తాను బాస్ ఎన్గిర భాస్కరన్ చిత్ర షూటింగ్ సమయంలో తన కథను సంతానంకు వినిపించానన్నారు.
ఈ కథను శింబు హీరోగా తెరకెక్కిం చాలని భావించానని, అందుకు సంతానం సహాయం చేస్తాననడంతో స్కిప్ట్రును ఆయనకు ఇచ్చానని చెప్పారు. అలాంటిది సంతానం తన అనుమతి లేకుండా తన కథతో కన్నా లడ్డు తిన్న ఆశయా పేరుతో చిత్రాన్ని రూపొందించారని ఆరోపించారు. ఈ విషయమై సంతానంతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఆయన తనను దూరం చేస్తూ వచ్చారని తెలిపారు. తన కథతో చిత్రాన్ని రూపొందించిన సంతానంపై చర్యలు తీసుకోవాలని కోరారు.
సంతానంతో పాటు పవర్స్టార్ శ్రీనివాసన్ తదితరు నటించిన ఈ చిత్రాన్ని సంతానం, రామనారయణన్ సంయుక్తంగా నిర్మించారు. సంతానం ఈ విషయమై విషయం సెటిల్ చేసుకుని విడుదల చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే 'కన్నా లడ్డు తిన్న ఆశయా' విడుదల అవుతోంది. ఈ చిత్రం ఇప్పటికే బిజినెస్ సర్కిల్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.