Don't Miss!
- News అష్టదిగ్బంధనం - బీఆర్ఎస్ భవిష్యత్ పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు..!!
- Automobiles కూతురిపై ప్రేమ - కోట్ల రూపాయల కారు గిఫ్ట్ ఇచ్చిన తండ్రి వీడియో
- Finance Essential Medicines: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న అవసరమైన ఔషధాల ధరలు..
- Sports `దాదా` మళ్లీ మొదలు పెట్టాడయ్యా: హీటెడ్ ఆర్గ్యుమెంట్
- Technology రూ.12వేల కంటే తక్కువ ధరకే స్మార్ట్ఫోన్.. సెగ్మెంట్లో తొలిసారిగా 45W ఫాస్ట్ ఛార్జింగ్, డ్యూయల్ స్పీకర్లు..!
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
చెక్ బౌన్స్ కేసులో అరెస్టు- విడుదల
బెంగళూరు: ఈ మధ్య కాలంలో చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ అయ్యే ఆర్టిస్టులు, సినిమావాళ్లు ఎక్కువ అవుతున్నారు. రీసెంట్ గా తమిళదర్శకుడు చేరన్ ఈ కేసులో ఇరుక్కుని నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆ మధ్యకాలంలో తెలుగు నుంచి జీవితరాజశేఖర్ కూడా ఇదే తరహా కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు మరో ఆర్టిస్టు ఇదే సీన్ రిపీట్ అవుతోంది.
చెక్కు బౌన్సు కేసుకు సంబంధించి పలుమార్లు విచారణకు గైర్హాజరు అవుతున్న నటుడు మయూర్ పటేల్ను హలసూరు ఠాణా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. ఆయన్ను సివిల్ కోర్టు ముందు హాజరు పరచగా, జామీనుపై విడుదలయ్యారు.
వివరాల్లోకి వెళితే గౌరిబిదనూరుకు చెందిన సెల్వకుమార్ అనే వ్యక్తికి మయూర్ పటేల్ ఇచ్చిన రూ.5 లక్షల చెక్కు పలుమార్లు వెనక్కు వచ్చింది. దీంతో ఆయన సివిల్ కోర్టులో దావా వేశారు. దొడ్డబళ్లాపుర ఠాణాలో ఒక కేసు కూడా వేశారు. విచారణకు గైర్హాజరవుతున్న కారణంగా ఆయనపై న్యాయమూర్తి అరెస్టు వారెంటును జారీ చేశారు.