Don't Miss!
- News ఏపీలో కూటమికి వచ్చే సీట్లు ఇవే- రఘురామ తాజా అంచనా..!
- Travel నహర్ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
- Lifestyle మనోడు ఎక్కడైనా తగ్గేదేలే అనిపించుకున్నాడు, అల్లు అర్జున్ కు అంతర్జాతీయ గుర్తింపు
- Automobiles రూ.5 లక్షల కంటే తక్కువ ధరలో బైక్ కావాలా.. ఇక్కడ చూడండి
- Finance EPFO: మీకు పీఎఫ్ ఖాతా ఉందా.. అయితే ఈ పని చేయండి..!
- Technology ధర రూ.17999 కే 108MP కెమెరా, 6000mAh బ్యాటరీ, 6.78 అంగుళాల డిస్ప్లే 5G స్మార్ట్ఫోన్..!!
- Sports తలతిక్క నిర్ణయాలు: ఆ టీమ్కు అసలు సెన్స్ ఉందా: మాజీ లెజెండ్ ఫైర్
సెక్సీ హీరోయిన్ రాజకీయాలకు అంతా షాక్
మల్లేశ్వరంలోని కర్ణాటక జనతా పార్టీ కార్యాలయంలో సాయంత్రం జరిగిన ఒక కార్యక్రమంలో పార్టీ నేతలు పూజాగాంధీని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. నిరుపేదలు, రైతుల పక్షాన నిలిచిన కేజేపీకి సేవలందించాలని వచ్చానని పూజా వెల్లడించారు. పార్టీతాత్కాలిక అధ్యక్షుడు ధనంజయకుమార్ ఆమెకు పుష్పగుచ్చాలు అందచేసి స్వాగతం పలికారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కేజేపీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తానని పూజాగాంధీ ప్రకటించారు. మరికొందరు సినీ నటులు కేజేపీలో చేరేందుకు ఆసక్తితో ఉన్నారని ధనంజయకుమార్ వెల్లడించారు.
నటి పూజాగాంధీ... యడ్యూరప్ప ఆధ్వర్యంలోని కర్ణాటక జనతా పార్టీ (కేజేపీ) తీర్థం స్వీకరించారు. కాబోయే భర్త ఆనందగౌడతో కలిసి కేజేపీ కార్యాలయంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఆమెకు కేజేపీ నాయకుడు విజయకుమార్ పార్టీ పతాకాన్ని అందజేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యడ్యూరప్ప రైతుల కోసం ప్రత్యేక బడ్జెట్, మహిళల కోసం వేర్వేరు పథకాల్ని ప్రవేశపెట్టిన ఘనతను సొంతం చేసుకున్నారని, అందుకే తాను కేజేపీలో చేరుతున్నట్లు పూజా ఈ సందర్భంగా ప్రకటించారు. హావేరిలో ఆదివారం నిర్వహించే సభలో పాల్గొని తాను పార్టీలో పూర్తి స్థాయి కార్యకర్తగా కొనసాగుతానని తెలిపారు. జేడీఎస్లో తనకు సరైన ప్రాతినిధ్యం దక్కని నేపథ్యంలో ఆ పార్టీకి దూరం కావలసి వచ్చిందన్నారు. పార్టీ సూచించిన మార్గంలో తాను ప్రజా సేవలో పాల్గొంటానని చెప్పారు.
సీనియరు నటి మాలాశ్రీ, శృతిలతో పాటు మరికొందరు చిత్రరంగ ప్రముఖులు కేజేపీలో త్వరలో చేరతారని నట, దర్శక నిర్మాత మదన్ పాటిల్ తెలిపారు. జెడియు సీనియరు నాయకుడు మైఖేల్ ఫెర్నాండెజ్తో పాటు ఆ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నేతలు కార్యకర్తలతో సహా పార్టీలో చేరతారన్నారు. పూజా చేరిక తరువాత కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిల్ని తినిపించుకుని సంబరం చేసుకున్నారు. పూజాగాంధి జేడీఎస్కు గుడ్బై చెప్పి కేజేపీలో చేరటం వల్ల వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యానించారు. ఆమె జేడీఎస్లో ఇమడలేకే పార్టీని వీడారని అన్నారు.