Don't Miss!
- Technology యూట్యూబ్కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సంచలన నిర్ణయం: గోవా చిత్రోత్సవ బహిష్కరణ
బెంగళూరు : కళసా బండూరి నీటి పథకం విషయంలో గోవా ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ చందనసీమ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్ని బహిష్కరించాలని తీర్మానించింది. ఈ నెల 20 నుంచి 30 వరకు చలనచిత్రోత్సవాల్ని నిర్వహించనున్నారు.
ఇక్కడ సమావేశమైన చలనచిత్ర వాణిజ్య మండలి ఈ మేరకు తీర్మానించింది. సమావేశం వివరాల్ని మండలి అధ్యక్షుడు సా.రా.గోవిందు వెల్లడించారు. చలనచిత్రోత్సవాలకు చిత్రసీమ నుంచి పాల్గొనడం లేదని చెప్పారు. అవార్డు పొందిన 'నాను అవనల్ల అవళు' సినిమా ప్రదర్శనకు మాత్రం తీర్మానం నుంచి మినహాయించారు.
ఈ ఫిల్మోత్సవ్లో దాదాపు 34 దేశాల నుండి 131 సినిమాలు ప్రదర్శితం కానున్నాయి. కేరళ రాష్ట్రంలోని 18 ప్రధాన పట్టణాలలో ఈ సినిమాలను ప్రదర్శిస్తారు. ఈ ఉత్సవాన్ని ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ ప్రారంభించనున్నారు. దక్షిణాసియాలోని అత్యంత పెద్ద ఫిలిం మార్కెట్గా పిలువబడే ఇండీవుడ్ ఫిలిం మార్కెట్ సంస్థ ఈ ఉత్సవానికి ప్రాయోజకులుగా వ్యవహరిస్తున్నారు.
'ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులతోపాటు సినిమా ప్రేమికులు భారీ సంఖ్యలో ఈ ఫిల్మోత్సవ్లో పాల్గొనబోతున్నారు. ఈ వేడుకల్లో భాగంగా యాభైఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ప్రముఖ మలయాళ దర్శకుడు ఆదూరి గోపాలకృష్ణన్ను ఘనంగా సత్కరించబోతున్నాం. అలాగే ప్రముఖ బాలీవుడ్ నిర్మాత యష్చోప్రాకు ఈ ఉత్సవంలో ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈ ఫిల్మోత్సవ్లో 'గోల్డెన్ ఫ్రేం' అవార్డు కోసం 50 చిత్రాలు పోటీ పడుతున్నాయి.
వీటితోపాటు తొలిసారి తీసిన సినిమాలు, లఘు చిత్రాలు, డాక్యుమెంటరీ చిత్రాలకు కూడా పోటీ ఉంటుంది. ఇరానియన్ దర్శకుడు ఖోశ్రో మాసౌమి నేతృత్య వహిస్తున్న జ్యూరీ ఈ సినిమాలను సమీక్షిస్తుంది. ప్రపంచంలో అత్యంత పెద్ద ఫిలిం మార్కెట్గా భారత్ను నిలపాలనే లక్ష్యం దిశగా ఈ ఉత్సవాలను నిర్వహించడం గొప్ప విషయం.
ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ఫిల్మోత్సవ్ను నిర్వహించేందుకు కేరళ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాల్ని అందిస్తోంది' అని సంస్థాపక డైరెక్టర్ సోహాన్రారు తెలిపారు. 50 సంవత్సరాల సినీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆదూరి గోపాల్కృష్ణన్కు ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ఘన సన్మానం ఉన్నాయి.