Don't Miss!
- Sports Rishabh Pant: నోకియా వల్ల కాదు.. అదే మా కొంపముంచింది
- News కేసీఆర్కు మరో షాక్: బీఆర్ఎస్కు కడియం శ్రీహరి, కావ్య గుడ్బై, వరంగల్ కాంగ్రెస్ ఎంపీగా బరిలో
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
కంపెనీ యజమాని కిడ్నాప్: కన్నడ దర్శకుడు అరెస్టు: సినిమా ప్లాప్ తో మెంటల్ గా !
నగదు విషయంలో మనస్పర్థలు వచ్చి ఓ కంపెనీ యజమానిని కిడ్నాప్ చేసిన కేసులో కన్నడ సినీ దర్శకుడిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఎడరు కనసు ( రెండు కలలు) అనే కన్నడ సినిమా దర్శకుడు మదన్ ను శనివారం బెంగళూరు
బెంగళూరు: నగదు విషయంలో మనస్పర్థలు వచ్చి ఓ కంపెనీ యజమానిని కిడ్నాప్ చేసిన కేసులో కన్నడ సినీ దర్శకుడిని కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. ఎడరు కనసు ( రెండు కలలు) అనే కన్నడ సినిమా దర్శకుడు మదన్ ను శనివారం బెంగళూరు నగర శివార్లలోని దేవనహళ్లి సమీపంలో అరెస్టు చేశారు.
కన్నడ నటుడు విజయరాఘవేంద్ర, కారుణ్య రామ్ జంటగా నటించిన'ఎరడు కనసు'అనే కన్నడ సినిమాకు మదన్ దర్శకత్వం వహించాడు. ఈసినిమా ప్రచారం (ప్రమోషన్) కోసం దర్శకుడు మదన్ ప్రకటనల సంస్థ (యాడ్ ఏజెన్సీ) యజమాని పరమేశ్వర్ కు రూ. 16.30 లక్షలు ఇచ్చారు.
రెండు నెలల క్రితం విడుదలైన ఎరడు కనసు సినిమా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదని సమాచారం. తాను డబ్బు ఇచ్చినా సినిమాకు సరైన రీతిలో ప్రచారం చెయ్యలేదని మదన్ కోపం పెంచుకున్నారు. తాను ఇచ్చిన సోమ్ములో రూ. 8 లక్షలు తిరిగి ఇవ్వాలని పరమేశ్వర్ కు చెప్పాడు.
నగదు తిరిగి ఇవ్వడానికి పరమేశ్వర్ అంగీకరించలేదు. ఈ విషయంలో మదన్ సహనం కోల్పోయి తన స్నేహితులతో కలిసి మరమేశ్వరన్ ను కిడ్నాప్ చేశాడని ఆరోపణలు ఉన్నాయి. మా కుమారుడు మూడు రోజుల నుంచి ఇంటికి రావడం లేదని పరమేశ్వర్ తల్లిదండ్రులు మాగడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసిన పోలీసులు శనివారం దేవనహళ్ళి సమీపంలో (బెంగళూరు అంతర్జాతీయ విమనాశ్రయం వద్ద) మదన్ ను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఎరడు కనసు సినిమా విడుదలై విజయం సాధించకపోవడంతో అప్పటి నుంచి అసహనానికి గురైన దర్శకుడు మదన్ కనిపించిన వారందరితో గొడవ పెట్టుకుంటున్నాడని ఆరోపణలు ఉన్నాయి.