Don't Miss!
- News Lok Sabha Election 2024: నేడే తొలి దశ పోలింగ్, 102 స్థానాల్లో ఎన్నికలకు సర్వం సిద్ధం
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ప్రముఖ కన్నడ సీరియల్ నటి, నటుడు దుర్మరణం: పార్క్ చేసిన ట్యాంకర్ ను కారు ఢీకొని !
పుణ్యక్షేత్రానికి వెళ్లి బెంగళూరు తిరిగి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నడ టీవీ సీరియల్ ప్రముఖ నటీ, నటుడు దుర్మరణం చెందిన ఘటన కర్ణాటకలోని మాగడి తాలుకా సోలూరు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో
బెంగళూరు: పుణ్యక్షేత్రానికి వెళ్లి బెంగళూరు తిరిగి వస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నడ టీవీ సీరియల్ ప్రముఖ నటీ, నటుడు దుర్మరణం చెందిన ఘటన కర్ణాటకలోని మాగడి తాలుకా సోలూరు సమీపంలో జరిగింది. ఈ ప్రమాదంలో మరికొందరికి తీవ్రగాయాలైనాయి.
మహానది, త్రివేణి సంగమ, మధుబాల తదితర సూపర్ హిట్ సీరియల్స్ లో ప్రధాన పాత్ర పోషించిన నటి రచనా (23), నటుడు జీవన్ (25) దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో రంజిత్, ఉత్తమ్, హోన్నేష్, కార్తిక్, ఎరిక్ అనే యువకులకు తీవ్రగాయాలై హర్షా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు చెప్పారు.
కార్తిక్ పుట్టిన రోజు సందర్బంగా బుధవారం అందరూ బెంగళూరు గ్రామీణ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కుక్కేసుబ్రమణ్య దేవస్థానంకు వెళ్లారు. అక్కడే ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కార్తిక్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.
గురువారం వేకువ జామున సఫారీ కారులో అందరూ బెంగళూరు బయలుదేరారు. మార్గం మధ్యలో మాగడి తాలుకా సోలూరు సమీపంలోని జాతీయరహదారి 48లో రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్ ను సఫారీ కారు ఢీకొనింది. ఈ ప్రమాదంలో నటి రచనా, నటుడు జీవన్ దుర్మరణం చెందారు.
రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలైన వారిని స్థానికులు రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు బాధితులను 108 వాహనాల్లో హర్షా ఆసుపత్రికి తరలించారు. మద్యం మత్తులో వాహనం నడిపి రోడ్డు పక్కన నిలిపి ఉన్న ట్యాంకర్ ను ఢీకొన్నారా ? లేక ఆకస్మికంగా ప్రమాదం జరిగిందా ? అని దర్యాప్తు చేస్తున్నామని కుదూరు పోలీసులు తెలిపారు.