Don't Miss!
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- News నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు, మంత్రి సంచలన వ్యాఖ్యలు, ఇది వాళ్లపనే అని నాకు తెలుసు !
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మోహన్ బాబు మా నాన్న కాళ్లు పట్టుకున్నారు: కారణం చెప్పిన రాజా రావు
ప్రముఖ నటుడు కత్తి కాంతారావు చివరి రోజుల గురించి ఆయన తనయుడు రాజా రావు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. నాన్నగారు చివరగా బాలకృష్ణ గారు హీరోగా తెరకెక్కిన 'పాండురంగడు' చిత్రంలో నటించారని, అందులో మోహన్ బాబు గారు చిన్న గెస్ట్ రోల్ చేశారని, అపుడు మోహన్ బాబుగారు నాన్నగారి కాళ్లు పట్టుకున్నారని రాజారావు గుర్తు చేసుకున్నారు.
నాన్నగారి కాళ్లు మాత్రమే పట్టుకుంటానన్నారట
‘పాండురంగడు' సినిమా షూటింగ్ సమయంలో మోహన్ బాబుగారు ఒక మంచి మాట చెప్పారట. ఈ సినిమాలో ఆయనది ఒకరి కాళ్లు పట్టుకునే పాత్ర. నేను ఆ వేషం వేయాలంటే కాంతారావుగారు ఆ పాత్రలో నటించాలి అని షరుతు పెట్టారట. వేరే ఆర్టిస్టు ఎవరైనా ఈ పాత్ర చేయను అని మోహన్ బాబుగారు చెప్పారట. వెంటనే ఆ చిత్ర బృందం నాన్నగారి వద్దకు వచ్చి ఈ విషయం చెప్పి ఆయన్ను నటించడానికి ఒప్పించారు.... అని రాజారావు గుర్తు చేసుకున్నారు.
Recommended Video
మోహన్ బాబుతో మంచి అనుబంధం
మోహన్ బాబుగారికి నాన్నగారితో మంచి అనుబంధం ఉంది. మోహన్ బాబు ఫస్ట్ మూవీ ప్రతిజ్ఞ. మా నాన్నగారు యాక్ట్ చేసిన సినిమా పేరు కూడా ‘ప్రతిజ్ఞ'. ఆయన ఆ షూటింగ్ అప్పుడు నాన్నను బుక్ చేశారు. చేసి ఒకటే చెప్పారు. కాంతారావుగారు మీరు హీరోగా ప్రతిజ్ఞ హిట్టయింది. అందుకని మీ పిక్చర్ పేరు నేను పెట్టుకుంటాను. మీరు నాతో యాక్ట్ చేయాలని అని చేయించారు. అలా ఫస్ట్, లాస్ట్ మోహన్ బాబు గారితో చేశారు. మోహన్ బాబుగారు నాన్న గారి కాళ్లు పట్టేదే చివరి చిత్రం.... అని రాజారావు తెలిపారు.
చాలా పొంగిపోయారు
నాన్నగారు లాస్ట్ మేకప్ వేసింది మోహన్ బాబుతో కలిసి చేసిన పాండురంగడు చిత్రమే. మోహన్ బాబుగారు కాళ్లు పట్టుకునే సీన్ ఆయనతోనే చేస్తాననడంతో నాన్నగారు చాలా పొంగిపోయారు అని రాజా రావు గుర్తు చేసుకున్నారు.
వాణిశ్రీ వల్ల అంతా పోయింది, ఆస్తులు అమ్ముకున్నాం: కాంతారావు తనయుడు రాజా రావు
వాణిశ్రీ వల్ల అంతా పోయింది, ఆస్తులు అమ్ముకున్నామని కాంతారావు తనయుడు రాజా రావు వెల్లడించారు. ఆయన చెప్పిన
పూర్తి
వివరాల
కోసం
క్లిక్
చేయండి.