Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్ప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సిగరెట్ కాలుస్తున్న హీరోయిన్ పై అభ్యంతరం
ఇప్పుడు కరీనా సిగెరట్ కాల్చే ఈ సీన్ కూడా యువతను ప్రభావితం చేస్తుందని సెన్సార్ బోర్డ్ సభ్యులు భావించారు. సినిమాలో అయితే ఇలాంటి సన్నివేశాలు వచ్చినప్పుడు 'చట్టరీత్యా నేరం అని, ఆరోగ్యానికి హానికరం' అని పొందుపరుస్తారు. ట్రైలర్లో అలా చేయరు కాబట్టి... ఆ దృశ్యాలను 'బ్లర్' (అస్పష్టం) చేయమని పేర్కొన్నారు సెన్సార్ బోర్డ్ సభ్యులు. అలాగే సినిమాలో కూడా ఈ సన్నివేశాలను బ్లర్ చేయమని చెప్పారు.
ఇక ఈ చిత్రం మనీషా కొయరాలా జీవిత చరిత్ర ఆధారంగా సినిమా చేస్తున్నారంటూ వచ్చిన వార్త లు వస్తున్నాయి. మధూర్ బండార్కర్ దర్శకత్వంలో కరీనాకపూర్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న హీరోయిన్ చిత్రం మనీషా జీవిత చరిత్ర ఆధారంగానే అని వినపడుతోంది. 1990-2005 ల మధ్య జరిగిన ఆమె జీవత ఎత్తు పల్లాలను సినిమాలో చూపిస్తాడని చెప్పుకుంటున్నారు.
అలాగే ఆమె ఆల్కహాల్ కు బానిస అవ్వటం,ఓ వెలుగు వెలిగిన ఆమె జీవితం ఇలా ఇబ్బందికరంగా తయారవటం ప్రధానాంశాలు అంటున్నారు. అలాగే సెకండాఫ్ లో ఆమె వివాహ జీవితం ఫెయిల్యూర్ అవ్వటం కూడా ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే ఆ విషయాన్ని దర్శకుడు మధూర్ ఖండిస్తున్నాడు. నో..నో..నా చిత్రం ప్రత్యేకంగా ఎవరి జీవితాన్ని ఉద్దేశించి కాదు అంటున్నాడు. ఇక రీసెంట్ గా మనీషా కొయరాల తాగి ఓ పంక్షన్ కి వెళ్లి మీడియా కళ్లల్లో పడిన సంగతి తెలిసిందే. ఆమె ప్రస్తుతం బాలీవుడ్ లో తల్లి పాత్రలకు ట్రై చేస్తోంది.