twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మా ఆయన కూడా ఒప్పుకున్నారు!!

    By Staff
    |

    Karishma Kapoor
    బాలీవుడ్ లో ఇప్పుడంతా ఫేడవుట్ అయిన హీరోయిన్స్ సెకెండ్ ఇన్నింగ్స్ ఫేజ్ నడుస్తోంది. తాజాగా ఒకప్పుటి టాప్ హీరోయిన్ కరిష్మా కపూర్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వటానికి ఏర్పాట్లు చేసుకుంటోందని తెలుస్తోంది. అప్పట్లో..రాజా హిందూస్ధానీ,దిల్ తో పాగల్ హై,జుడ్వా,హీరో నంబర్ వన్, మృత్య దండ,బీవీ నంబర్ వన్ వంటి ఎన్నో సినిమాల్లో నటించి గోల్డెన్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఆ తర్వాత 2003లో సంజయ్‌ కపూర్‌ అనే పారిశ్రామికవేత్తను పెళ్లాడిన తరవాత కరిష్మా సినిమాలకు దూరమైంది. కొంతకాలానికి ఇదిగో.. మా చిత్రంతోనే కరిష్మా కపూర్‌ రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెడుతోంది.. అంటూ చాలా మంది దర్శకనిర్మాతలు ప్రకటించారు.

    వాటిల్లో 'యు అండ్‌ ఐ', 'రామ్‌గోపాల్‌ వర్మ కీ ఆగ్‌', 'జూన్‌ ఆర్‌' వంటివి ఈ స్టెట్ మెంట్ తో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే వేటిలోనూ ఆమె నటించడానికి ముందుకు రాలేదు. ఎటువంటి స్పష్టమైన ప్రకటనా చేయలేదు. ఇటీవల కాజోల్‌, మాధురీ దీక్షిత్‌ల పునరాగమనంతో ఆమె కూడా మళ్లీ వెండి తెర మీద కనిపించాలనుకుంటున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ ''90ల్లో మేమంతా పోటాపోటీగా నటించాం. వారు మళ్లీ ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టారు. నేను కూడా నటిస్తే బాగుంటుందని చాలా మంది అంటున్నారు.

    మావారు కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం ఓ చిత్రానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. పూర్తిగా హీరోయిన్ గా నటిస్తానా.. అంటే చెప్పలేను. నా పాత్రకు ప్రాధాన్యం ఉంటే తప్పకుండా చేస్తాను. అలాంటిదే ఇప్పుడు నాదగ్గరకొచ్చిన పాత్ర. బహుశా మరో నెల రోజుల్లో ఏ విషయం ప్రకటిస్తాన''ని చెప్పుకొచ్చింది. అంటే త్వరలో కరిష్మా మనకు దర్శనమివ్వనుందన్నమాట.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X