twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లేడీ డైరెక్టర్ దర్శకత్వంలో కరణం మల్లీశ్వరి బయోపిక్.. బాలీవుడ్ హీరోయిన్!

    |

    వెండితెరపై వరుసగా బయోపిక్ లు వస్తున్నాయి. ప్రముఖుల జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఒలంపిక్స్ లో ఇండియా తరుపున మెడల్ సాధించిన తొలి మహిళ కరణం మల్లీశ్వరి. ఆమె తెలుగు మహిళ కావడం తెలుగువారందరికీ గర్వకారణం.

    మల్లీశ్వరి బయోపిక్ అంశం మరో మారు తెరపైకి వచ్చింది. రాజుగాడు చిత్రంతో మహిళా దర్శకురాలు సంజన రెడ్డి గుర్తింపు పొందారు. ఆమె మల్లీశ్వరి బయోపిక్ కు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

    Karnam Malleswari biopic on cards

    వైట్ లిఫ్టింగ్ లో మెడల్ సాధించిన ఏకైక భారత మహిళ కరణం మల్లీశ్వరి. ఆమె జీవిత చరిత్రపై సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని సంజన రెడ్డి భావిస్తున్నారు. కరణం మల్లీశ్వరి పాత్ర కోసం బాలీవుడ్ హీరోయిన్ ని ఎంపిక చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావలసి ఉంది.

    English summary
    Karnam Malleswari biopic on cards. Sanjana Reddy will going to direct this movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X