Don't Miss!
- Lifestyle వీర్య కణాల సంఖ్య ఫాస్ట్గా పెరగాలంటే ఇవి వెంటనే తినండి..!
- Sports SRH ఎఫెక్ట్తో IPLలో కొత్త రూల్: బౌలర్లకు గుడ్ & బ్యాటర్లకు బ్యాడ్ న్యూస్!
- Technology 200MP కెమెరాతో వచ్చే Honor 90 ఫోన్ పై భారీ ఆఫర్! తక్కువ ధరకే పొందండి
- News రాయలసీమ నెత్తిన పాలు పోసిన మోడీ
- Finance IT News: ఇది శిక్ష-శిక్షణా.. TCS టెక్కీల కన్నీళ్లు.. అన్నంతపని చేసేసిన టెక్ దిగ్గజం..
- Automobiles మండే వేసవిలో ట్రాఫిక్ పోలీసులకు చల్లచల్లని ఏసీ హెల్మెట్లు.. ఎక్కడో తెలుసా.??
- Travel Hanuman Jayanti 2024 : ఢిల్లీలోని ఈ పురాతన హనుమాన్ దేవాలయాలను చూడాల్సిందే..!
అన్నంత పనీ చేశారు: పద్మావతి థియేటర్లమీద మొదలైన దాడి
మాకు చూపించకుండా ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తే థియేటర్లపై దాడి చేస్తాం...అంటూ కొన్నాళ్లుగా వస్తున్న బెదిరింపులను నిజం చేస్తూ రాజస్థాన్ లోని కోటాలో ఉన్న ఆకాశ్ థియేటర్ ను కర్ణిసేన ఆధ్వర్యంలో రాజ్ పుత్
Recommended Video
బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన పద్మావతి చిత్రంపై వివాదాలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు. ఆ చిత్రంలో పద్మావతి పాత్రను వక్రీకరించారని ఆ చిత్ర విడుదలను నిలిపివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
థియేటర్ పై దాడి
ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా 'పద్మావతి' చిత్ర విడుదలను ఆపలేరని ఆ చిత్ర హీరోయిన్ దీపికా పదుకొనే చెప్పింది. ఆ చిత్రంలో నటించినందుకు ఒక మహిళగా తాను చాలా గర్వపడుతున్నానని తెలిపింది.అయితే ఆ ప్రకటన వెలువడిన రోజే పద్మావతి చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించిన థియేటర్ పై దాడి జరిగింది.
థియేటర్లపై దాడి చేస్తాం
మాకు చూపించకుండా ఆ చిత్రాన్ని ప్రదర్శిస్తే థియేటర్లపై దాడి చేస్తాం...అంటూ కొన్నాళ్లుగా వస్తున్న బెదిరింపులను నిజం చేస్తూ రాజస్థాన్ లోని కోటాలో ఉన్న ఆకాశ్ థియేటర్ ను కర్ణిసేన ఆధ్వర్యంలో రాజ్ పుత్ వర్గీయులు ధ్వంసం చేశారు. కర్ణిసేన కార్యకర్తలు రాజ్ పుత్ వర్గీయులు ఆకాశ్ థియేటర్ పై దాడి చేసి కౌంటర్ అద్దాలను కిటికీలను ధ్వంసం చేశారు.
8 మంది పోలీసులు అదుపులో
దాడులకు పాల్పడిన 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామికంగా ఆ చిత్రానికి వ్యతిరేకంగా నిరసన తెలపవచ్చని అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే చర్యలు తప్పవని రాజస్థాన్ హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా హెచ్చరించారు.
నిషేధించాలంటూ
ఆ సినిమాను నిషేధించాలంటూ హర్యానా మంత్రి విపుల్ గోయెల్ ....కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. గత నెలలో ఈ సినిమాకు వ్యతిరేకంగా గుజరాత్లోని కర్ణిసేన ఆధ్వర్యంలో దాదాపు లక్ష మంది రాజ్పుత్ వర్గీయులు ఆందోళన చేపట్టారు.
|
వివాదాలు దాడుల నేపథ్యంలో
తమ సినిమా ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉండదని రాజ్ పుత్ల పట్ల గౌరవం పెంపొందించేలా ఈ సినిమా ఉంటుందని సంజయ్ లీలా భన్సాలీ ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చినా ఆందోళనలు ఆగడం లేదు. మరోవైపు ఈ సినిమాను అడ్డుకోవాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ ను కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదాలు దాడుల నేపథ్యంలో డిసెంబరు 1 న పద్మావతి విడుదలపై ఉత్కంఠ ఏర్పడింది.