Don't Miss!
- Sports చరిత్ర సృష్టించిన KL రాహుల్.. ధోనీ రికార్డు బ్రేక్
- News ఏపీలో తీవ్ర వడగాల్పులు: అప్రమత్తంగా ఉండక తప్పదు
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
సినిమా వివాదం: అప్పుడు దర్శకుడుపై తుపాకులతో దాడి.. ఇప్పుడు మరోసారి ..అద్దాలు పగలకొట్టి
రాజస్థాన్లోని 13వ శతాబ్దానికి చెందిన చారిత్రక చిత్తోడ్గఢ్ కోటపై కర్ణి సేన అనే బ్యాచ్ కి చెందిన ఆందోళనకారులు దాడి చేశారు.
ముంబై:
ప్రముఖ
సినీ
దర్శకుడు
సంజయ్
లీలా
బన్సాలీపై
రాజ్పుత్కు
చెందిన
కర్ణిసేన
కార్యకర్తలు
దాడి
చేసిన
సంగతి
మురవక
ముందే
ఇదే
బ్యాచ్
మరో
ఎటాక్
కు
దిగారు.
రాజస్థాన్లోని
13వ
శతాబ్దానికి
చెందిన
చారిత్రక
చిత్తోడ్గఢ్
కోటపై
కర్ణి
సేన
అనే
బ్యాచ్
కి
చెందిన
ఆందోళనకారులు
దాడి
చేశారు.
కోటలోని రాణి పద్మిని మహల్లో ఉన్న అద్దాలను పగలగొట్టారు. కోటలోని అద్దాలు చరిత్రను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని.. వాటిని తొలగించాలని తాము అనేక సార్లు హెచ్చరించామని కర్ణి సేన బృందం తెలిపింది. కోట నిర్వాహకులు అద్దాలను తొలగించకపోవడంతో తాము దాడి చేసినట్లు పేర్కొంది.
అప్పటి ముస్లిం పాలకుడు అల్లాఉద్దిన్ ఖిల్జీ ఈ అద్దాల్లోనే రాణి పద్మిని ముఖాన్ని చూశారని పర్యాటకులకు చెబుతుంటారు. అయితే రాణి ముఖాన్ని అల్లాఉద్దీన్ ఖిల్జీకి ఎప్పుడూ చూపించలేదని, అసలు ఆ కాలంలో ఇలాంటి అద్దాలే లేవని కర్ణి సేన వాదన.
కాగా.. రాణి పద్మిని జీవిత కథ ఆధారంగా 'పద్మావతి' అనే సినిమా తెరకెక్కిస్తున్న బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీపై కూడా ఈ బృందం గతంలో దాడి చేసింది. బన్సాలీ అక్కడ సినిమా చిత్రీకరణ జరుపుతున్న సమయంలో ఆందోళనకారులు ఆయనపై దాడి చేశారు. మరో పక్క అసలు రాణి పద్మిని పాత్ర కేవలం కవిత్వంలో కన్పించే వూహాత్మక పాత్రే తప్ప చరిత్రలో ఆమె లేరని చరిత్రకారులు పేర్కొంటున్నారు. చరిత్రకు విరుద్ధంగా సినిమా తీస్తున్నారని, అతిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ కర్ణి సేన కార్యకర్తలు చిత్రీకరణను అడ్డకుంటున్నారు. షూటింగ్ చేస్తున్న ప్రదేశం వద్ద గందరగోళం సృష్టిస్తున్నారు.
'పద్మావతి' చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ దీపిక పదుకోన్ టైటిల్ రోల్ చేస్తున్నారు. అల్లావుద్దీన్ ఖిల్జీగా రణవీర్ సంగ్ నటిస్తున్నారు. వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడినట్లు సినిమాలో సన్నివేశాలు చిత్రీకరించినట్లు ఆరోపిస్తూ ఈ దాడికి పాల్పడ్డారు.
పద్మిణి రాణి, అల్లావుద్దీన్ ఖిల్జీ మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు చరిత్రను తప్పుదోవ పట్టిస్తున్నారని, పద్మిణి ఆత్మాభిమానం గల రాణి అని, చిట్టోర్గఢ్ కోటపై దాడి జరిగినపుడు ఆమె అల్లావుద్దీన్ కు లొంగిపోకుండా ఆత్మత్యాగం చేసిందని ఆందోళనకారులు వాదిస్తున్నారు. చరిత్రను వక్రీకరించి సినిమా తీస్తే సహించబోమని, 'పద్మావతి' సినిమాలో వారి మధ్య ప్రేమ సన్నివేశాలు ఉన్నట్లు చూపిస్తే ఊరుకోబోమని ఆందోళన కారులు హెచ్చరించారు.